Krishnam Raju: సినీ నటుడు రాజకీయ నాయకుడు మాజీ కేంద్రమంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈయన మరణించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సినీ తారలు మొత్తం తరలివచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇకపోతే సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్ హౌస్లో నిర్వహించారు.
ముందుగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలను జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈయన అంత్యక్రియలు మాత్రం కనకమామిడి ఫామ్ హౌస్ లో అధికారక లాంచనాలతో నిర్వహించారు. అయితే ఇలా అంత్యక్రియలను ఫామ్ హౌస్ లో నిర్వహించడం వెనుక ఓ కారణం ఉందని తెలుస్తోంది.కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని త్వరలోనే ఇక్కడ తన అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకొని ఇక్కడే నివాసం ఉండాలని భావించినట్లు తెలుస్తోంది.
ఇలా ఈయన బ్రతుకున్న సమయంలో తాను మరణిస్తే అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు చేయాలని తన ఇంటిని చూసుకుంటూ అక్కడే ఉంటానంటూ పలుసార్లు వెల్లడించారట.ఇలా బ్రతికున్న సమయంలో తన అంత్యక్రియలు అక్కడే చేయాలని తన పెదనాన్న కోరడంతో ప్రభాస్ చివరి క్షణంలో తన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ నిర్వహించారు.
ఇలా కృష్ణంరాజు కోరిక ప్రకారమే ఆయన అంత్యక్రియలను తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు ప్రభాస్ చేతుల మీదుగా కాకుండా తన సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి. కృష్ణంరాజు గారికి కుమారులు లేకపోవడంతో తన సోదరుడు కుమారుడైన ప్రబోద్ చేతులమీదుగా జరిగాయి. కృష్ణంరాజు గారికి ముగ్గురు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…