Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తరచూ నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నడంటూ చెప్పే లక్ష్మి పార్వతి బాలకృష్ణ గురించి ఇంట్రస్టింగ్ విషయాలను మాట్లాడారు.

అన్ స్టాపబుల్ కి పిలిచే దైర్యం బాలయ్యకి ఉందా…
లక్ష్మి పార్వతి ఈమధ్య కాలంలో వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ నందమూరి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్ గా తారకరత్న మరణించాక లక్ష్మి పార్వతి ఆయన మరణం గురించి అనుమానలను వ్యక్తం చేసారు. ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి పిలిస్తే వెళ్తారా అంటూ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవగా నేను వెళ్లడం పక్కన పెట్టండి ముందు నన్ను షోకి పిలిచే ధైర్యం బాలకృష్ణ కు ఉందా అంటూ ప్రశ్నించారు.

ఎందుకంటే తన తండ్రి మరణం దగ్గరి నుండి నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది అందుకే నన్ను పిలిచే ధైర్యం బాలయ్య చేయడు అంటూ నవ్వారు. ఎన్నేళ్లు అపద్ధాలు చెప్పినా నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. నా విషయంలో 26 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాను, ఇప్పటికి తెలుగు ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నాయి అంటూ మాట్లాడారు.


































