తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకం గురించి తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీ ఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అయన వెల్లడించారు..

ఈ క్దరమంలో అయన మాట్లాడుతూ దళితులకు ఇవ్వడానికి భూమిలేదు కానీ మీరు అమ్మకానికి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నించారు ప్రభాకర్. తెలంగాణ సీడ్ బౌల్ అని కేసీఆర్ పదే పదే చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ విత్తనాల అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయని అయన ఆరోపించారు. ఏడేళ్లలో నకిలీ విత్తనాల దళారులను పట్టుకొని శిక్షించిన దాఖలాలు లేవు అని చెప్పారు.





























