కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అరుదైన గౌరవంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డును మరణం తర్వాత అతడికి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రకటించారు.

పునీత్కు వందనం పేరుతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. చాలామందితో సమాలోచనలు చేసిన తరువాత పునీత్కు కర్ణాటక అత్యున్నత పురస్కారమైన ‘కర్ణాటక రత్న’ను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అతడు కన్నడ ప్రజలకు కాదు దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. అతడు తనకు ఇష్టమైన నటుడు అని.. పునీత్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని సీఎం అన్నారు. కర్ణాటక నుంచి బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక బాలుడు పునీత్ అంటూ గుర్తు చేశాడు. తన చిన్నతనం నుంచే అద్భుతంగా నటించేవాడని కితాబిచ్చాడు.
ఇంత చిన్న వయసులో అలా నటించడం అంత సులువు కాదు అంటూ.. అన్నాడు సీఎం. భారతదేశంలో అత్యూన్నత పురస్కారం భారత రత్న. కానీ .. కార్ణటకలో మాత్రం రాష్ట్రం పరంగా అత్యన్నతమైనది కర్టాటక రత్న. వివిధ సేవలకు గుర్తింపులకు గాను ఈ అవార్డును ప్రకటిస్తారు.





























