Connect with us

Featured

సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత !!

Published

on

వేల పాటలతో కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతూనే కొద్దిసేపటి క్రితం కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం బాగానే ఉందంటూ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ చెప్తూ ఉన్నా తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో కొన్ని రోజులుగా లైఫ్ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్మో (ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సిస్టమ్‌తో బాలుకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. కానీ మృత్యువుతో పోరాడిన మన గాన గంధర్వుడు కొద్దీ సేపటి క్రితమే మరణించారు.

ఆయన మరణంతో కోట్లాదిమంది బాలు ఫాన్స్ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు సినిమా చరిత్రలో మరిచిపోలేని పేరు ఎస్పీ (శ్రీపతి పండితారాధ్యుల) బాలసుబ్రమణ్యం. గాయకుడిగా పరిచయమై.. నటుడిగా, డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా, సంగీత దర్శకుడిగా కొనసాగారు. భారతీయ భాషల్లో దాదాపు 45 వేల పాటలు పాడిన కళాకారుడు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేటలో 04 జూన్​ 1946లో హరికథా పండితుడు సాంబమూర్తి, శకుంతలమ్మ ఇంట్లో జన్మించారు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు మొత్తం ఎనిమిది మంది సభ్యులుగల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడి అందరి దృష్టిని ఆకర్షించారు బాలు. 1966 లో అప్పటి ప్రముఖ నటుడు పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాకు ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు.

ఈ సినిమాతో గాయకుడిగా బాలు ప్రయాణం మొదలైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. బాలు రంగప్రవేశం నాటికి ఘంటశాల వెంకటేశ్వరరావు ఒక్కరే గాయకుడు. రామకృష్ణ లాంటి వాళ్లు ఉన్నా… అంతంతే. బాలసుబ్రమణ్యం సినిమా రంగంలో అడుగుపెట్టడం.. నటుల స్వరానికి తగ్గట్టుగా బాలు పాటలు పాడడంతో.. ఆదరణ పెరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఓ పాపాలాలీ సినిమాలో ‘మాటేరాని చిన్నదాని’ పాటను గుక్క తిప్పుకోకుండా పాడడం బాలుకే సాధ్యం. నటుల గొంతుకు తగ్గట్టుగా పాడడం వల్ల నటులకు డబ్బింగ్​ చెప్పే అవకాశం కూడా బాలుకు కలిగింది. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ కావడం, ఆయా సినిమాల్లో కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్ వంటి ప్రముఖ నటులు నటించడంతో బాలుకు వద్దన్నా అవకాశాలు కలిగాయి. గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి కూడా డబ్బింగ్​ చెప్పారు. 1969 లో వచ్చిన పెళ్లంటే నూరేళ్ల పంట సినిమాలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. ఆ తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు.

తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరో ప్రాణం, రక్షకుడు, దీర్ఘ సుమంగళీ భవ మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశారు. సినిమాల్లోనే కాక టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ప్రముఖ చానల్​ ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు. ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి. 2001లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన ‘మిథునం’ సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. తెలుగు పరిశ్రమలో ఘంటసాల తర్వాత అత్యంత ఎక్కువ ప్రాధాన్యత సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం లో అద్భుతమైన ప్రతిభ ఉంది.

అతను గొంతు మార్చి ఏ హీరోకి అయినా తగ్గట్టుగా పాడగలడు. తన మొత్తం జీవితంలో 12 అవార్డును సంపాదించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగులో ఏ గాయకుడు సృష్టించిన రికార్డులను నెలకొల్పాడు. ఒక్కసారి తాను సంపాదించిన అవార్డులు ఏంటో తెలుసుకుంటే… 1989 లో సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన మైనే ప్యార్ కియా సినిమా లో పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం, లత మంగేష్కర్, శ్రద్ధా సిన్హా పాడారు. అయితే ఈ సినిమా పాటలకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికి పైగా అమ్ముడుపోయాయి. ఒకే ఒక సినిమాకు సంబంధించిన ఆల్బమ్స్ కోటికిపైగా అమ్ముడు పోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాలో పాటలు పాడినందుకు గాను 1990 సంవత్సరంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి బెస్ట్ ప్లేబాక్ సింగర్ గా(ఉత్తమ నేపధ్య గాయకుడు) ఫిలింఫేర్ అవార్డు లభించింది. 2006వ సంవత్సరంలో తెలుగులో విడుదలైన శ్రీ రామదాసు చిత్రంలో ఏఎన్ఆర్, నాగార్జున, స్నేహ సుమన్ ప్రధాన పాత్రలలో నటించగా… ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా కంచర్ల గోపన్న జీవిత చరిత్ర పై తెరకెక్కి అనేకమైన అవార్డులను సొంతం చేసుకుంది. హీరో నాగార్జున కు ఉత్తమ నటుడిగా నంది అవార్డును రాగా… శ్రీరామదాసు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సంపాదించింది. అయితే ఈ సినిమాలోని పాటలను పాడినందుకు రాను… ముఖ్యంగా ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’, ‘అదిఅదిగో భద్రగిరి’, ‘చాలు చాలు చాలు’ పాటలు పాడినందుకు ఎస్పీబీకి ఎప్పుడు రాని ప్రేక్షకాదరణ వచ్చింది.

ఇటువంటి పాటలకు తన గాత్రం దానం చేసినందుకుగాను 2007వ సంవత్సరంలో ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 2008, 2011 సంవత్సరాల్లో కూడా అతనికి ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 1987 అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్, 1984లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఆరు నేషనల్ అవార్డులు కూడా లభించాయి. రుద్రవీణ సాగరసంగమం శంకరాభరణం లాంటి చిత్రాలలో తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించి నేషనల్ అవార్డులను తన సొంతం చేసుకున్నాడు. 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డులను కూడా బాలసుబ్రమణ్యం గెలుచుకున్నారు. పద్మశ్రీ పద్మభూషణ్ బిరుదును కూడా భారతదేశ ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్యానికి సమర్పించింది. తెలుగు సినీ చరిత్రలో ఇంతటి విశేషమైన ఖ్యాతిని గడించిన మన ఎస్ పీ బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దైవాన్ని ప్రార్ధించుదాం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!