Liger : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన సినిమా లైగర్. రమ్యకృష్ణ, మైక్ టైసన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమా టీజర్, ట్రైలర్ వల్ల బాగా హైప్ వచ్చి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఫ్యాన్స్ ను థియేటర్ రప్పించడానికి సరిపోతాయి. మరి కామన్ ప్రేక్షకుడు సినిమాకు రావాలంటే ఇంకేదో చేయాలి. ఒకటి కంటే ఎక్కువ భాషలలో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ మీద పూరీ, విజయ్, బాగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాకు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. రన్వీర్ సింగ్ ను టీజర్ లాంచ్ కి పిలవడం, అది ముంబై లోనే ఈవెంట్ చేయడం, ఇక కాఫీ విత్ కరణ్ వంటి షోలో పాల్గొనడం ఇవన్నీ హిందీ లో సినిమాకు హైప్ తీసుకురావడానికే. కానీ ఇవేవీ సరిపోవు అందుకే ఇంకా కొత్తగా ఆలోచించారు పూరీ, విజయ్.

ముంబై లోకల్ ట్రైన్ లో హీరోయిన్ తో…
సినిమా గురించి విడుదల అయ్యే రోజు వరకు ఏదో ఒకలాగా ప్రేక్షకుడు మాట్లాడితే సినిమాకు మంచి ప్రొమోషన్స్ వచ్చి సినిమాను థియేటర్ లో చూడడానికి ఆడియన్స్ వెళ్తారనేది సినిమా టీం నమ్మకం. అందుకే సినిమా ప్రమోషన్స్ ను తమ భుజాన వేసుకుని మరీ చేస్తుంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం భుజాన వేసుకోకుండా ఒళ్ళో పడుకొని మరీ చేస్తున్నాడు. లైగర్ ప్రమోషన్స్ కోసం ముంబై లోకల్ ట్రైన్ లో అనన్య పాండే తో కలిసి ప్రయాణించిన విజయ్ దేవరకొండ.

ప్రమోషన్స్ కోసం తిరిగి అలసిపోయాడేమో పాపం హీరోయిన్ అనన్య పాండే ఒళ్ళో తల పెట్టుకుని ఒక పవర్ నాప్ తీసేసాడు. ఇక హీరోయిన్ కూడా విజయ్ ని ఒళ్ళో పడుకో బెట్టుకుని తాను ఆనుకుని ఉన్న సీట్ కి తల వాల్చి కునుకు తీసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమవడంతో నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘తల’ పెట్టిన కార్యం సక్సెస్ అవ్వలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.































