దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అంటే మరో 14 రోజుల వరకు లాక్ డౌన్ చర్యలు పొంగించాలని రాష్ట్రాలను కోరింది.

అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో మే 29 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు కూడా మే 31 వరకు పొడిగించాయి. అయితే లాక్ డౌన్ 4.0 కు సంబంధించి మినహాయింపులు, మార్గదర్శకాలను కేంద్ర హోమ్ శాఖ గైడ్ లైన్స్ జారీ చేయనుంది. లాక్ డౌన్ 4.0 లో మరికొన్ని కొత్త నియమాలు ఉంటాయని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

































