కరోమహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సినీ కార్మికులు. అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక సినిమా షూటింగ్ లకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

ఈరోజు (ఆదివారం ) బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో ఆన్లైన్ లో సమావేసమైన అయన. ఈ విషయంపై మాట్లాడారు. అయితే కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను ఉద్ధవ్ కోరారు.

































