Connect with us

Featured

Mahesh Anand : 90’s నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

Published

on

Mahesh Anand : భారీకాయం, ఆజానుబాహుడు, మహేష్ ఆనంద్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు. 1989 మెగాస్టార్ చిరంజీవి నటించిన “లంకేశ్వరుడు” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రతి కథానాయకుడు మహేష్ ఆనంద్. మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగే ఈయన జీవితం.. అనుకోకుండా చీకటి కూపంలోకి నెట్టివేయబడింది. చిన్నప్పటినుంచి డాన్స్ అంటే ఇష్టపడే మహేష్ ఆనంద్ డాన్స్ కష్టపడి నేర్చుకున్నారు. అదేవిధంగా కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా పొందాడు. డాన్స్ ఎలాగూ వచ్చు కాబట్టి ఆయన ముంబైలో ఒక డాన్స్ స్కూల్ ప్రారంభించడం జరిగింది.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత తన కుమారుడి కోరిక మేరకు మహేష్ ఆనంద్ దగ్గర తన కొడుకును చేర్పించడం జరిగింది. అలా కొనసాగుతున్న క్రమంలో ఒకరోజు ఆ నిర్మాత మహేష్ ఆనంద్ నువ్వు సినిమాలో ఎందుకు ప్రయత్నించకూడదని అడిగాడు. మంచి ఫిజిక్ పైగా డాన్సర్ కావున సినిమా అవకాశాలు కూడా కంటిన్యూగా వస్తాయని చెప్పడంతో మహేష్ ఆనంద్ ఎగిరి గంతేశారు. ఆయన తండ్రి మరణానంతరం కుటుంబ భారాన్ని మొత్తం తన భుజస్కంధాలపై వేసుకుని తన ఒక్కగానొక్క చెల్లిని ఉన్నత చదువులు చదివించి పెళ్లి చేశాడు.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

ఆ నిర్మాత అన్నట్టుగానే బాలీవుడ్ దర్శకులకు మహేష్ ఆనంద్ ఫోటోలు పంపించడం జరిగింది అలా 1984 “కరిష్మా” చిత్రంతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన మహేష్ అనేక హిందీ చిత్రాల్లో సైడ్ విలన్, విలన్ పాత్రల్లో కనిపించారు. 1988 లో చిరంజీవితో ఒక చిత్రాన్ని నిర్మించాలనుకున్నా దాసరి నారాయణరావు బాలీవుడ్ లోని అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం చూడడంతో అందులో మహేష్ ఆనంద్ ఒక విలన్ గా కనిపించారు. అలా 1989లో వచ్చిన “లంకేశ్వరుడు” చిత్రంలో సినిమా క్లైమాక్స్ లో చిరంజీవితో పోరాట సన్నివేశంలో కనిపిస్తాడు. ఆ తర్వాత బొబ్బిలిసింహం, అల్లుడా మజాకా, తెలుగువీర లేవరా, నెంబర్ వన్.. ఈ చిత్రంలో మహేష్ ఆనంద్ కామెడీ టైమింగ్ బాగుంటుంది.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

ఆ తర్వాత ఘరానా బుల్లోడు, ఎస్పి పరశురాం చిత్రాల్లో మహేష్ ఆనంద్ కనిపిస్తారు. ప్రముఖ బాలీవుడ్ నటి రీనారాయ్ సోదరి బర్కారాయ్ ని పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలు కాపురం చేశారు. ఆ తర్వాత మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత “ఎరికా మెరియా డిసౌజా” 1987లో ఈ అమ్మాయిని మహేష్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1992లో మధుమల్హోత్రా ను పెళ్ళిచేసుకున్నారు. సినీ రంగుల ప్రపంచంలో ఏ తారా ఎప్పుడు రాలుతుందో ఎవరూ ఊహించలేరు. మద్యానికి తీవ్రంగా మహేష్ ఆనంద్ అలవాటుపడ్డారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు రష్యా లో స్థిరపడిన “ఉషాబచాని” అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 2005 ఉషాతో పెళ్లి మహేష్ ఆనంద్ కు కలిసొచ్చింది. సినిమాల్లో బిజీ అయ్యారు.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

కానీ నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ ప్రకారం గా షూటింగ్ వెళ్లి తనకిచ్చిన సీన్స్ కంప్లీట్ చేసుకుని రావడం తెలుగు సినిమాల్లో ఉండే సంప్రదాయం.. కానీ బాలీవుడ్ లో అలా కాదు హీరోకి ఎప్పుడు వీలైతే అప్పుడే షూటింగ్.. మహేష్ ఆనంద్ కి షూటింగ్ క్రమశిక్షణ ఉండేది కాదు. సెట్ కు సరిగా రాకపోవడం, షూటింగ్ టైంకు ఉండేవారు కాదు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. ఎవరికీ తెలియదు. మద్యం, క్రమశిక్షణ లోపంతో సినిమాని, కుటుంబాన్ని పట్టించుకోవడం ఆయన తగ్గించారు. ఇది గమనించిన భార్య ఉషా తన కొడుకుకి ఉజ్వల భవిష్యత్ ఇవ్వాలని మహేష్ ఆనంద్ తో చెప్పి కొడుకుతో రష్యా వెళ్ళిపోయింది. సినిమా లేవు, స్నేహితులు లేరు నాలుగు గోడల మధ్య మహేష్ తన జీవితాన్ని గడిపారు. ఇంకా మద్యానికి బానిస అయ్యారు. డబ్బు లేకపోవడంతో దినసరి కూలీ గా మారిపోయాడు. రోజు వచ్చిన డబ్బులతో మద్యం సేవించి.. ఎప్పుడో ముంబైలో “యారి” రోడ్, “వెర్సోవా” అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొన్నారు. అది ఇప్పుడు మహేష్ ఆనంద్ కి నివాసయోగ్యంగా మారింది.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

అందులోనే ఉంటూ దొరికిన పనిచేస్తూ, కాలం గడుపుతున్న సమయంలో తన చెల్లెలి కాపురం చక్కబడంతో మహేష్ ఆనంద్ ను గమనించిన చెల్లి ప్రతినెల డబ్బులు పంపిస్తూండేది. పండుగల సమయంలో చెల్లి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. 2005 నుండి 2019 మధ్య మహేష్ దుర్భర జీవితాన్ని అనుభవించారు. ఇది గమనించిన ఆనాటి బాలీవుడ్ నటుడు గోవిందా తాను నిర్మించబోయే “రంగీలారాజా” చిత్రంలో మహేష్ ఆనంద్ కి అవకాశం కల్పించారు. అలా దాదాపు 18 సంవత్సరాల తర్వాత బాలీవుడ్ లోకి తిరిగి రీ-ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు ఒకటి తరువాత ఒకటి బాగానే వచ్చాయి. కానీ మహేష్ ఆనంద్ లో మార్పు కనబడలేదు. ఇంకా ఖరీదైన మద్యం తాగుతూ డబ్బును వృధా చేసే వాడు. అదే “వెర్సోవా” అపార్ట్మెంట్ లో ఉంటూ..తాగుడుకు బానిసవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.

Mahesh Anand : 90's నాటి ఈ విలన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.. ఈ నిత్య పెళ్ళికొడుకు.. అత్యంత దారుణంగా మరణించాడు.!!

ఉదయం పని మనిషి వచ్చి బ్రేక్ ఫాస్ట్ ఇచ్చేది. అలా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసేది. హఠాత్తుగా ఒకరోజు పనిమనిషి డోర్ కొట్టిన మహేష్ తలుపు తీయలేదు. పనిమనిషి తాను తెచ్చిన బ్రేక్ ఫాస్ట్ డోర్ ముందు పెట్టి వెళ్ళిపోయింది. అలానే మధ్యాహ్నం కూడా పెట్టింది.. చుట్టూ ఉన్న ఇళ్ళలో పనిచేసి తిరిగి వచ్చేసరికి తలుపు తీయలేదు.పెట్టిన వస్తువులు అక్కడే ఉన్నాయి. తిరిగి రెండవ రోజు అక్కడికి వచ్చిన పరిస్థితి అలాగే ఉంది. అది గమనించి పనిమనిషి మహేష్ ఆనంద్ చెల్లికి ఫోన్ చేసింది. ఆమె వచ్చి సందేహంతో పోలీసులకు ఫోన్ చేశారు. వారంతా లోపలికి వెళ్ళేసరికి మహేష్ ఆనంద్ సోఫాలో విగతజీవిగా కనిపించారు. పక్కనే మద్యం సీసాలు, గ్లాసులు ఉన్నాయి. ఆయన చనిపోయి మూడు రోజులు కావడంతో శరీరం ఉబ్బి దుర్గంధం వస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో ఫిబ్రవరి-9-2019న మహేష్ ఆనంద్ కి గుండెపోటు వచ్చి చనిపోయారని పోలీసులు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన భార్య, కొడుకులు రష్యా నుంచి వచ్చి మహేష్ ఆనంద్ దహనసంస్కారాలు చేశారు. అలా దాదాపు ఐదు పెళ్లిళ్లు చేసుకుని, క్రమశిక్షణ లేని జీవితం, మద్యం సేవించడం, నిత్యపెళ్లి కొడుకుల మారి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం, మహేష్ ఆనంద్ మరణానికి కారణం అయ్యిందని చెప్పవచ్చు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!