Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల అవ్వబోతుంది. ఇక సినిమా ప్రచారాల్లో బిజీగా ఉన్నారు మహేష్ బాబు. అటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మరోవైపు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ చిత్రానికి సంబంధించిన ముచ్చట్లు చెబుతూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ నటించింది. ఇక ఇటీవలే ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.

ట్విట్టర్ లో ఆమెను ఫాలో అవుతా….
ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్ గా ఉండే మహేష్ బాబు తరచూ తన ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూంటారు. ఇక ఇపుడు సోషల్ మీడియాను తన సినిమా ప్రొమోషన్స్ కోసం ఉపయోగించుకున్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఒక వీడియో ద్వారా మహేష్ బాబు తెలిపారు. ఇక ఇందులో అభిమానులు రకరకాల ప్రశ్నలు వేశారు.
Here's #WhatsHappening! pic.twitter.com/zGF6s5crdk
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022
తన గురించి ఒక హ్యాష్ టాగ్ చెప్పమనగా కామ్ మరియు ఫోకస్ అని చెప్పారు. ఇక మీరు ట్విట్టర్ లో ఫాలో అవ్వాలనుకుంటున్న వ్యక్తి ఎవరు అంటే నమ్రత కు ట్విట్టర్ ఉంటే బాగుండు నేను ఫాలో అయ్యుండే వాడిని. ఇక సినిమా వేసవిని మరింత హిట్ చేస్తుందంటూ చెప్పారు. ఇక ఇంట్లో ఎవరు బాగా చురుకు అంటే సితార అంటూ వివరించారు. ఇక సితార పెన్నీ సాంగ్ లో కనిపించింది, త్వరలో సినిమాలో కనిపించి మెప్పిస్తుందా అంటే ఆల్రెడీ తనను తాను నిరూపించుకుంది అని సమాధానం చెప్పారు.



























