Mahesh Babu: సర్కారు వారి పాట సినిమా ఈరోజు విడుదలయి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. మహేష్ యాక్షన్ ప్లస్ కామెడీ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటించింది. ఇక థమన్ బిజీఎం కొన్ని సన్నివేశాలకు బాగోలేదానే టాక్ వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు తన తదుపరి చిత్రాలను త్రివిక్రమ్ తోనూ రాజమౌళి తోనూ ప్లాన్ చేసాడు. ఇక అభిమానులు కూడా రాజమౌళి తో మహేష్ ప్రాజెక్ట్ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు.

రాజమౌళితో సినిమా ఎపుడో సెట్ అవ్వాల్సి ఉన్నా అన్ని కుదిరి ఇపుడు ఓకే అయింది. పోకిరి సినిమా టైములోనే రాజమౌళితో కాంబినేషన్ సెట్ అవ్వాల్సి ఉన్నా ఇప్పటికి సెట్ అయింది. ఇక ఇపుడు ఇంకో క్రేజీ కాంబో గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. రాజమౌళితో సినిమాలాగే మరో స్టార్ డైరెక్టర్ వీ. సముద్ర దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాల్సింది. ఇప్పటి తరం వారికి సముద్ర గారు తెలియక పోవచ్చు కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన సముద్ర సింహ రాశి, శివ రామ రాజు, ఎవడైతే నాకేంటి వంటి హిట్ సినిమాల దర్శకుడు.
20ఏళ్ల క్రితమే సముద్ర, మహేష్ కలయికలో సినిమా రావాల్సి ఉన్నా కుదరలేదు. ఒక్కడు సినిమా సమయంలోనే మహేష్ కి కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు సముద్ర. సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఇక సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు అలా ఈ సూపర్ కాంబో ఆగిపోయింది ఇప్పటికి ఎపుడైనా మహేష్ ఎదురుపడితే ఆ కథా ఇంకా ఉందా లేక ఎవరికైనా ఇచ్చేసారా అని సముద్ర ను అడుగుతారట ఈ విషయం ఇటీవలి ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా సముద్ర గారే తెలిపారు.

































