Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి వచ్చే ఏ చిన్న అప్ డేట్స్ మిస్ అవ్వడం లేదు ఆయన అభిమానులు. ఈ సినిమా లో మొదటిసారిగా కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటిస్తున్నారు.ఇక డైరెక్టర్ పరశురాం ఈ సినిమా పై బాగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తో హిట్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోవాలని భావిస్తున్నారు.

ఇక కీర్తి సురేష్ కూడా వరుస పరాజయాలను చవి చూస్తుండడంతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని భావిస్తోంది. ఇక ఈ సినిమా లో ఇటీవల విడుదలైన కళావతి పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సామాజిక మధ్యమాల్లో. ఇక ఆ తర్వాత విడుదలైన పెన్నీ సాంగ్ మహేష్ కూతురు సితార డాన్సు తో అదరగొట్టింది. ఇక ఈ పాట కూడా బాగానే ఫేమస్ అయింది.
ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది చిన్న చిన్న పనులను పూర్తి చేస్తున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో యాక్షన్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇక గోవా, స్పెయిన్, దుబాయ్ లలో షూటింగ్ ను పూర్తి చేసారు. ఇక హైదరాబాద్ లో రైల్వే సెట్స్ వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాను మే 12న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. వేసవి సెలవులు సినిమా కు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. సినిమా ఇలా ఆకట్టుకుంటుందో మహేష్ అభిమానులను ఏ మేరకు మెప్పిస్తుందో చుడాలి మరి.



























