Makeup Man Madhava Rao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిల్లీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15 న మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఆయన అంతిమ యాత్రలో ఎంతోమంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు. ఇక ఆయన గురించి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో ఆయనకు మేకప్ మాన్ గా పనిచేసిన మాధవరావు గారు తెలిపారు.

కృష్ణ గారికి మొదటి నుండి మేకప్ మెన్ గా ఉన్న మాధవరావు గారు కృష్ణ గారి మహోన్నత వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. ఆయన తనను ఒక పనివాడిగా కాకుండా స్నేహితుడిగాను, సోదరుడిగాను చూసేవారంటూ చెప్పారు. ఏ సహాయం కావాల్సినా అడగకముందే కృష్ణ గారు చేసేవారు అంటూ అయన గురించి చెప్పారు. ఇక ఆయనకు చివరిసారిగా ‘శ్రీ శ్రీ’ సినిమాకు మేకప్ వేశానంటూ చెప్పారు. ఇక కృష్ణ గారు మరణించాక ఆయనను అలా ఆచేతంగా చూసి చాలా ఏడ్చాను.

చివరిసారిగా ఆయనకు మేకప్…
ఆ సమయంలో ఏమి చేయాలో ఎవరికీ ఏమి తెలియక పోతే నేనే కృష్ణ గారి మొహం తుడిచి ముక్కులో దూది పెట్టి చేతులు అంత కట్టేసీ నీట్ గా రెడీ చేసాను. ఒకవైపు బాధను దిగమింగుతూనే ఆయనకు అన్నీ చేసాను. ఇక అంతిమ యాత్ర అప్పుడు వెన్నంటే ఉన్నాను అంటూ మాధవరావు గారు ఎమోషనల్ అయ్యారు. అంతిమ యాత్ర అప్పుడు కూడా ఆయనకు స్నానం చేయించి బట్టలు తోడిగి బొట్టుపెట్టి అన్నీ నేనే చేశాను అంటూ కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
































