Connect with us

Featured

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

Manchu Family: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక వార్తతో మంచు ఫ్యామిలీలో

Published

on

Manchu Family: గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక వార్తతో మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక ఇటీవలే మంచు విష్ణు, మోహన్ బాబు వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పనిచేస్తున్న నాగ శ్రీను అనే వ్యక్తి మంచు వారి ఆఫీసులో 5 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను దొంగలించాడు అంటూ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగ శ్రీను ని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తూ పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?
Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

అంతేకాకుండా ఈ విషయంపై నాగ శ్రీను ఒక సెల్ఫీ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అధికార పక్షాలు వైరల్ అయిపోయింది. ఆ వీడియోలో నాగ శ్రీను తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, అనవసరంగా మంచు ఫ్యామిలీ తనపై లేని నిందలు వేస్తోందని తెలిపాడు. అదేవిధంగా తనను మంచు ఫ్యామిలీ వారి చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టారు అని చెప్పుకొచ్చాడు.అలాగే నాగ శ్రీను ని మోహన్ బాబు కులం పేరుతో దూషించడమే కాకుండా సదరు వ్యక్తి తల్లిని కూడా అసభ్యకర రీతిలో మాట్లాడుతూ ప్రవర్తించాడు అని పోలీసులకు తెలిపాడు.

Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?
Manchu Family: మంచు ఫ్యామిలీని అరెస్టు చేయాలి…. డిమాండ్ చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘాలు..?

ఇక నాగ శ్రీను ఆ మాటలు చెప్పిన అప్పటినుంచి ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నాగ శ్రీను ని కులం పేరుతో దూషించిన మోహన్ బాబు, మంచు విష్ణు వెంటనే అతనికి క్షమాపణలు తెలపాలి అన్ని నాయి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరికి మద్దతుగా బీసీ కుల సంఘాల నాయకులు కూడా మద్దతు ఇస్తున్నారు. నాగ శ్రీను కి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. కానీ క్షమాపణ చెప్పకపోగా ఈ విషయం ఫై స్పందించడం గురించి పక్కన పెడితే అసలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

క్షమాపణలు తెలియజేయాలి…

దీనితో నాయి బ్రాహ్మణ సంఘాలు మరొకసారి ఈ విషయంపై స్పందించాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రభుత్వ అధికారులను కలిసి మంచు మోహన్ బాబు నాగ శ్రీనుకి క్షమాపణలు తెలపాలి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా నాగ శ్రీను చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని అనంతరం విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి అని కోరాయి నాయి బ్రాహ్మణ సంఘాలు. దీనితో మరొకసారి మంచు బాబు ఫ్యామిలీ వార్తల్లోకెక్కింది. మరి ఈ సారి అయినా ఈ విషయంపై మంచు ఫ్యామిలీ స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఈ విధంగా మంచు ఫ్యామిలీలో ఎవరో ఒకరు సోషల్ మీడియాలో నిలుస్తూ ట్రోలింగ్స్ కి గురవుతూ, నెటిజన్స్ ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒకసారి మంచు విష్ణు సోషల్ మీడియాలో నిలువగా, మరొకసారి మంచులక్ష్మి, మరోసారి మంచు మోహన్ బాబు ఇలా ఒకరి తర్వాత ఒకరు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Advertisement

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!