Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఇక్కడ సక్సెస్ కావడం కోసం కృషి చేస్తున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె సరైన స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో ఈమె తీసుకున్నటువంటి బాధ్యతల గురించి తెలియజేశారు మనోజ్ మౌనికల వివాహం చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం నాన్నకి ఉండేది.
ఇక నాన్నను పెళ్ళికి ఒప్పించడం నావల్ల కాలేదు అందుకే ఓసారి యాదాద్రి వెళ్లినప్పుడు ఎలాగైనా వీరి పెళ్లికి నాన్నను ఒప్పించు దేవుడా అంటూ భారం మొత్తం తనపై వేశానని తెలిపారు మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం జరిగిపోయిందని అందుకే వారిద్దరిని యాదాద్రి తీసుకెళ్లానని తెలిపారు.ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారని ఇప్పుడు వేరుగా ఉంటున్నారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు.

Manchu Lakshmi: రాజకీయాలపై ఆసక్తి లేదు…
ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే చేసి పెడతారని తనకు చాలా సాయంగా ఉంటారని తెలియజేశారు.ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ తాను నలుగురు పిల్లలని కనాలని అనుకున్నాను కాకపోతే దేవుడు నాకు ఒకరిని ఇచ్చారు అంటూ తెలియచేశారు. ఇక రాజకీయాల గురించి ప్రశ్నలు రావడంతో అసలు తనకు రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























