Manchu Lakshmi: మంచు లక్ష్మి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకోవడం కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు అయితే ముంబై వెళ్ళిన తర్వాత మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా తరచూ బికినీ ఫోటో షూట్ లు చేయడం స్విమ్ సూట్ ఫోటోషూట్ లు చేయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇకపోతే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో మంచు లక్ష్మి ఒక విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇలా తాము ఏదైనా ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాలి అంటూ అల్లు అర్జున్ సలహా ఇచ్చారని అందుకే తాను ఈ విషయాన్ని బయట పెడుతున్నానని ఈమె తెలిపారు.
2024వ సంవత్సరం మొదలు కావడంతో తాను ఇకపై రైస్ నాన్ వెజ్ అసలు తినను అంటూ ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇదే విషయాన్ని నేను బహిరంగంగా చెబుతున్నానని,చూడాలి మరి ఎన్ని రోజులపాటు నేను వీటిని తినకుండా ఉంటానో అంటూ ఈమె ఈ విషయాన్ని వెల్లడించారు.
రైస్ నాన్ వెజ్ తినను..
మంచు లక్ష్మి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని బయటకు చెప్పడంతో అల్లు అర్జున్ ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈమె పోస్టుకు రిప్లై ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి వారందరూ ఒకేసారి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటే ఎలా లక్ష్మక్క.. ఇది సాధ్యమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే మంచు లక్ష్మి సాధారణంగా భోజన ప్రియురాలు అనే విషయం మనకు తెలుసు. అలాంటి భోజనం మానేస్తున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.





























