Manchu Vishnu : గత సంవత్సరం 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేయడం, విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు చాలా గొడవలు, మాటల యుద్ధంతో సాగింది. ఈ ‘మా ‘ ఎన్నికల సమయంలో తనపై దారుణంగా ట్రోల్స్ జరిగాయాని మంచు విష్ణు ఆరోపించారు. నన్ను మాత్రమే కాదు మా కుటుంబం మొత్తాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పారు. ఎవరు ఇలా చేస్తున్నారో దానికి సంబంధించి అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పుకొచ్చారు.

ఐ పి అడ్రస్సులతో సహా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా…
ప్రస్తుతం ‘జిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విష్ణు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్లలో పాల్గొన్న విష్ణు, తన కుటుంబంపై వస్తున్న ట్రోల్స్ విషయంపై స్పందించారు. ఒక హీరో తనను తన కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేసారని చెప్పారు. ఆ హీరోకి సంబందించిన కంపెనీ నుండి నాపై ట్రోలింగ్ జరుగుతోంది, ఇకపై సహించేది లేదు అని స్పష్టం చేశారు. దీనికి సంబందించిన అన్ని ఆధారాలు, ఐపీ అడ్రస్సులు పోలీసులకి ఇస్తానని తెలియజేసారు.

జూబ్లీహిల్స్ లో ఆ హీరోకి చెందిన కంపెనీ నుండి తనపై ట్రోలింగ్ జరుగుతోందని, దీనికోసం ఏకంగా 21 మంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారని తెలిపారు. వారి ఆఫీస్ అడ్రస్ తోపాటు, వారు వినియోగించే ఐపీ అడ్రస్ వివరాలు నా దగ్గర ఉన్నాయి. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తాను అని మీడియాతో చెప్పారు.



























