Manjula Ghattmaneni : సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. కృష్ణ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలు చేయాలని ఆసక్తి ఉన్నా కృష్ణ అభిమానులకు నచ్చకపోవడంతో విరమించుకుంది. కానీ మంజుల తన సినిమా కెరీర్ లో సెల్వమణి దర్శకత్వంలో ‘రాజస్థాన్’ అనే సినిమాలో నటించింది. ఇక మలయాళం లో సురేష్ గోపి సినిమాలో నటించింది. ఇక తెలుగులో ‘షో’ అనే సినిమాను స్వయంగా నిర్మించి, నటించారు మంజుల. ఈ సినిమాకు నీలకంఠ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం విశేషం. మంజుల గారు సినిమా మీద ఇష్టంతో నిర్మాతగా మారి తల్లి పేరు మీద ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు.

మహేష్ ప్రేమను చూపించలేడు…
ఇక తన తమ్ముడు మహేష్ సూపర్ స్టార్ గా తన తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. మంజుల ఇక తమ్ముడి గురించి మాట్లాడుతూ తాను ప్రేమను బయటికి చూపించడు అని చెప్పారు. పుట్టినరోజున ఫోన్ చేస్తే విష్ కూడా చేయడు. ఊరికే ఏంటి ఈరోజు ప్లాన్స్ అంటూ మాట్లాడుతాడు అంతే కానీ కచ్చితంగా ఆరోజున ఫోన్ చేస్తాడు, మా అమ్మ కూడా ఎపుడూ చెబుతుంది వాడు పైకి చెప్పడే ఇష్టాన్ని అన్నీ మనసులో దాచుకుంటాడు అంటూ చెప్పింది మంజుల.

ఇక కృష్ణ గారి ప్రేమ అన్ కండిషనల్ ప్రేమ అంటూ చెప్పింది. ఇక భర్త సంజయ్ స్వరూప్ గురించి మాట్లాడుతూ ప్రతి పనిలోనూ నాకు సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహించే వ్యక్తి సంజయ్ అని మంజుల తన భర్త గురించి చెప్పింది. ఇక మహేష్ తన మంచి జడ్జి అంటూ చెప్పింది. ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా విషయాన్ని చెప్పేస్తాడు. నేను చేసే పనిలో తప్పులను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి మహేష్ బాబునే అని చెప్పింది.



































