Connect with us

Featured

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

CM Jagan-Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల టికెట్ ధరలు,

Published

on

CM Jagan-Chiranjeevi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానం గురించి గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభ్యర్థనలు చేస్తోంది.

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?
CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

తాజాగా ఇండస్ట్రీ పెద్దలు రేపు 10వ తేదీని సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ చిత్ర నిర్మాతలు సీఎంతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలోని పలు సమస్యలపై టాలీవుడ్ ప్రముఖులు చర్చించాలని అనుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. 

CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?
CM Jagan-Chiranjeevi: రేపు సీఎంతో మెగస్టార్ భేటీ..! టాలీవుడ్ సమస్యలపై చర్చించేనా..?

తాజాగా సీఎంతో సమావేశం తర్వాత టికెట్ రేట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో థియేటర్ల టికెట్ ధరలపై ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా సినీ ప్రముఖుల సీఎంకు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ కూడా తన నివేదికకు తుది మెరుగులు దిద్దే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీ సమస్యలపై గత నెల చిరంజీవి నేరుగా సీఎంతో సమావేశం అయ్యారు.

టికెట్ ధరలు, ప్రదర్శన నిబంధనల..

ఆ సయమంలో నాలుగైదు వారాల్లో గుడ్ న్యూస్ వస్తుందని కూడా చెప్పారు. ఘర్షణ వాతావరణం పెంచేలా ఎవరూ కూడా విమర్శలు చేయవద్దని ఇండస్ట్రీ వర్గానికి సూచించారు. ఇదిలా ఉంటే నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ తో భేటీ అయ్యారు. టికెట్ ధరలు, ప్రదర్శన నిబంధనల గురించి వివరించారు. ఇదిలా ఉంటే మంత్రి ఇటు సామాన్యుడికి న్యాయం చేయడంతో పాటు ఇండస్ట్రీకి కూడా ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Featured

Anupam Parameswaran: నాకు పులిహోరనే కావాలి.. బోల్డ్ సీన్స్ పై టిల్లు బ్యూటీ హాట్ కామెంట్స్!

Published

on

Anupam Parameswaran: ప్రేమమ్ అనే సినిమా ద్వారా మలయాళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా తర్వాత అనంతరం ఈమె తెలుగులో కూడా పలు సినిమా అవకాశాలను అందుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే టిల్లు స్క్వేర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ చిత్రంగా రాబోతున్నటువంటి ఈ సినిమా మార్చి 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి ఓ మై లిల్లీ అనే పాటను విడుదల చేశారు ఈ పాట లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాలో అనుపమ నటించినటువంటి బోల్డ్ సన్నివేశాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాలో ఈమె కాస్త బౌండరీస్ క్రాస్ చేస్తే మరి రొమాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది.ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక నటిగా నేను ఇన్ని సంవత్సరాలపాటు చేసినటువంటి పాత్రలను మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే నాకు చాలా బోర్ కొడుతుందని తెలిపారు.

బోర్ కొడుతున్నాయి..
మనకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతిరోజు మన ఇంట్లో బిర్యానీ చేసుకొని తినలేము కదా. అలాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు నాకు పులిహోర కూడా కావాలంటూ ఈమె రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ravi Teja: ఆ హీరోయిన్ నటనకు ఫిదా అయినా రవితేజ.. ఆమె నటన అంటే ఇష్టం అంటూ?

Published

on

Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి తన ప్రయాణం అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ,హీరోగా సినిమా అవకాశాలను అందుకునే స్థాయికి వెళ్లారు.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతో ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకపోయినా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కొనసాగుతున్నటువంటి రవితేజ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరి సరసన సినిమాలలో నటించారు.

ఇకపోతే తాజాగా రవితేజ ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

Advertisement

అనుష్క నటన సూపర్..
ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రవితేజకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. ఇప్పటివరకు మీరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఇలియానా అనుష్క శ్రేయ త్రిష వంటి హీరోయిన్ల సరసన నటించారు అయితే వీరందరిలో మీకు ఏ హీరోయిన్ నటన అంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురయింది.. ఈ ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ తనకు అనుష్క నటన అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రాగ ఈ సినిమా తర్వాత బలాదూర్ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
Continue Reading

Featured

Mrunal Thakur: దానికోసం ఆరాటపడిన రోజులు కూడా ఉన్నాయి.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

Published

on

Mrunal Thakur: టీవీ సీరియల్స్ లో నటిగా నటిస్తూ అనంతరం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నారు. అయితే ఈమె సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా తెలుగులో నటించే అవకాశాలు వచ్చాయి. ఇకపోతే ఇటీవల నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ద్వారా కూడా మంచి సక్సెస్ అందుకున్నటువంటి మృణాల్ ఠాకూర్ అనంతరం విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇకపోతే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుసగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే నటి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ సెలబ్రిటీలకు అప్పుడప్పుడు విరామం అవసరమని కామెంట్లు చేశారు.

Advertisement

తీరిక లేకుంట గడిపాను..
ప్రస్తుతం సినీ ప్రయాణం చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబానికి సరైన సమయం కేటాయించాలని తెలిపారు. అందుకే నటీనటులు ఇండస్ట్రీకి అప్పుడప్పుడు విరామం ఇచ్చి తమ కుటుంబంతో ప్రయాణాలు చేస్తూ గడపాలని తెలిపారు. నేను రెండు సంవత్సరాల పాటు తీరిక లేకుండా కష్టపడుతూ గడిపానని కొన్నిసార్లు నిద్ర కోసం ఆరాటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!