Connect with us

Featured

చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఆస్తి కోసం ఫైట్ !! (అసలు ట్విస్ట్ ఏమిటంటే..?!)

Published

on

టాలీవుడ్ అంటేనే చిత్ర, విచిత్ర లోకం. ఏ రోజు ఏ గాసిప్ వినాల్సివస్తుందోనని సినీరంగ ప్రముఖులు కంగారు పడుతుంటే.. ఆ గాసిప్స్ చదివి పాఠకులు ఎంజాయ్ చేస్తుంటారనడానికి ఉదాహరణగా మొన్నటి వరకూ చిరు, బాలయ్య మధ్య వివాదమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడా వివాదం సద్దుమణిగిందనుకునేలోపే చిరు, రామ్ చరణ్ ల మధ్య ఆస్తి తగాదాలంటూ మరో రూమర్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి తాజా చిత్రం ఆచార్యకు ..ఆయన కుమారుడు రామ్ చరణ్ కేవలం ప్యాసివ్ ప్రొడ్యూసరే అని, డబ్బు పెట్టకుండా లాభం తీసుకెళ్తున్నాడని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు వెంటనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్ట్నైమెంట్స్ బృందం చెవిన పడ్డాయి. ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతున్న ఈ వార్తలను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ ఖండించింది. ఈ సందర్భంగా వాళ్ళొక ప్రకటనను కూడా విడుదల చేసారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే..

“రామ్ చరణ్ కు సంభందించిన కొణెదల ప్రొడక్షన్ కంపెనీలోనూ, అలాగే మా సంస్ద నిర్మిస్తున్న చిత్రంతోనూ సమానంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రొడక్షన్ కు సంభందించిన డిస్కషన్స్, మానటరీ కంట్రిబ్యూషన్స్, ప్రొడక్షన్ అన్నీ సమానంగా మా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి పంచుకుంటున్నారు. ఈ 2 సంస్దలు కలిసి సమానంగా పనిచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎవరి డ్యూటీలు వాళ్ళే చేయాలి, ఎవరు ఏ రెస్పాన్సబులిటీ తీసుకోవాలో అన్ని విషయాలను మేమందరం చర్చించుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే సినిమా నిర్మాణం జరుగుతుంది” అని తెలియచేసారు. ఇంతవరకూ బాగానే వుంది. మరి రామ్ చరణ్, చిరుల మధ్య ఆస్తి కోసం తగాదాలేమిటి.? అని జుట్టు పీక్కుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..

ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ లు కొరటాల శివ తెరకెక్కించబోతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు అరగంట ఉంటుందని, అలాగే ఈ చిత్రంలో “ఖైదీ నెం 150” తర్వాత చిరుతో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తాజా సమాచారం. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సందేశాత్మక సినిమాలకు పెట్టింది పేరైన కొరటాల శివ ‘ఆచార్య’ను ఎలా తెరకెక్కిస్తున్నాడో తెలియాలంటే.. ఒక చిన్న ఉదాహరణగా ఈ చిత్ర కథలో దేవాదాయ భూముల ఆక్రమణలపై దర్శకుడు కొరటాల ఫోకస్ చేయడం ద్వారానే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చరణ్ నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు.

ఆచార్యలో రామ్‌ చరణ్‌, చిరంజీవి మధ్య ఓ ఫైట్‌ సీన్‌ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. చిరంజీవి అండర్‌ కవర్‌ అధికారిగా దేవాదాయ శాఖ అధికారి గా నటిస్తున్నాడని తెలిసింది. నక్సలైట్‌ అయిన రామ్‌ చరణ్‌ను పట్టుకోడానికి చిరు ప్రయత్నిస్తుంటాడని.. ఈ కధలో భాగంగానే తండ్రీ కొడుకుల మధ్య దేవాదాయ భూముల ఆస్తుల ఫైట్ జరుగుతుందని, అలాగే ఈ ఫైట్ సీన్‌పై డైరెక్టర్ కొరటాల శివ చాలా కేర్ తీసుకుంటూ చాలా అద్భుతంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. అదండి సంగతి.. చదివారుగా.. మొత్తానికి రియల్ లైఫ్ లో కాకుండా రీల్ లైఫ్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఆస్తి తగాదా జరగబోతుందన్నమాట.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!