సాధారణంగా మనకు ఎంతో దగ్గరైనా మన కుటుంబ సభ్యులు, మన ఆత్మీయులు మరణించి దూరమైతే వారికి గుర్తుగా వారితో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నిరంతరం వారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటారు. ఒక్కసారైనా వారితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోరికలను మైక్రోసాఫ్ట్ తీర్చ బోతోందా? అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన వారితో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా పనిచేసే ఒక చాట్బాట్ను రూపొందించింది. దీని ద్వారా చనిపోయిన వ్యక్తికు సంబంధించిన డేటా ఆధారంగా తయారు చేస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి వాయిస్, వారి డేటా ఫోటోలు వీడియోలను సేకరించిన అనంతరం ఈ చాట్ బాట్ ద్వారా రూపొందిస్తారు. ఈ విధంగా చాట్ బాట్ రూపొందించడం వల్ల అచ్చం చనిపోయిన వ్యక్తి లాగే మాట్లాడుతుంది. అంతే కాకుండా వారికి తెలిసిన వ్యక్తులను కూడా పలకరిస్తుంది. ఈ చాట్ బాట్ కు మరింత టెక్నాలజీని ఉపయోగించి 2 డి,3డీ లో రూపంలో ఫోటోలను కూడా చేర్చవచ్చు.
ఈ విధంగా మైక్రోసాఫ్ట్ తయారుచేసిన కొత్త టెక్నాలజీ ద్వారా చనిపోయిన వ్యక్తులు తమ దగ్గర ఉన్న భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా వారితో మాట్లాడుతున్న భావన మనలో కలుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెస్తుందా? లేక దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందా అనే విషయం గురించి క్లారిటీ తెలియడం లేదు. ఏది ఏమైనా ఈ టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి వస్తే ఎంతో మంది తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి కొంతవరకు ఊరటగా ఉంటుందని చెప్పవచ్చు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…