MLA ROJA : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని తెలుగుదేశం పార్టీ మహానాడుగా జరుపుకుంటారు. ఇక ఈ వేడుకలు శుక్రవారం ఒంగోలులో ఘనంగా మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో వైసీపీ పాలనను విమర్శించారు. ఇక ఈ కామెంట్స్ కి కౌంటర్ వేయాల్సిందే కదా ఏపీ పర్యాటక మంత్రి రోజా ఆ భాద్యతను తీసుకున్నారు. తిరుపతి పర్యటన ముగించుకున్న రోజా మహానాడుపై, చంద్రబాబుపై తీవ్రంగా స్పందించింది.

జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేసారు….
ఇక స్వర్గీయ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ, ఆయన్ను చంపేసి ఇపుడు మాత్రం ఫోటోకు దండలు వేసి దండం పెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి భయపడి తెలుగుదేశం పార్టీకి దూరం పెట్టారని ఫైర్ అయింది. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని 99 % ప్రజలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ప్రేమతో ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ బ్రతికుంటే చంద్రబాబుని తరిమికొట్టేవారని , రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అని ఎన్టీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బ్రతికుంటే ఇపుడు చంద్రబాబు పరిస్థితి ఏంటో అందరికి తెలుసనీ అన్నారు.

మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి టీడీపీ, జనసేన పనే….
బీ ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టాలనుకుంటే దళిత ఎమ్మెల్యే, బీసీ మంత్రి ఇంటిని కాల్చారని ఇది టీడీపీ, జనసేన కుట్ర అంటూ ధ్వజమెత్తారు. మంత్రి ఇంటిని కాల్చినవారు ఎంతటి వారైనా వదిలే సమస్య లేదని చెప్పారు. అల్లర్లను అదుపుచేయడంలో పోలీసులు చక్కగా వ్యవహరించారని ప్రశంసించారు. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టినా కనీసం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పలేదని చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


































