Mohan Babu : మంచు మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు సినిమాల్లో పెద్దగా రానించలేదు. మనోజ్ డిఫరెంట్ జోనర్ సినిమాలను ప్రయత్నించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. విష్ణు ప్రెసిడెంట్ అయి ఏడాది గడిచిన సందర్బంగా మా అసోసియేషన్ గవర్నింగ్ బాడీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా డిన్నర్ ఏర్పాటు చేసి మీడియా మీటింగ్ ఏర్పాటు చేసారు. ఇక ఇందులో మాట్లాడిన మోహన్ బాబు గారు ఆసక్తికరంగా మాట్లాడారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలంటూ చెప్పారు.

హనుమంతుడు కొట్టుకున్నాడు… మనిషి ఒళ్లంతా విషమే…
మోహన్ బాబు ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఇటీవల మరణించిన కృష్ణం రాజుగారిని స్మరించుకున్నారు. కృష్ణం రాజు గారు విష్ణు కి మంచి సలహాలు ఇచ్చేవరంటూ గుర్తు చేసుకున్నారు. ఇక రమణ మహర్షి గారు చెప్పినట్లు అన్ని దుర్గుణాలు కలిసి మనిషి పుడతాడు, పాముకి కొరల్లో విషం ఉంటే తేలుకి తోకలో విషం ఉంటే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటూ మొహాసన్ బాబు చెప్పారు. సినిమాల్లో గెలుపు ఓటములు సహజం కానీ ఒటమిని జీర్ణించుకోలేని కొంతమంది ఏం చేసారో అందరికీ తెలుసు, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను మా అధ్యక్షుడు గా చేసాను కానీ ఇలా డిన్నర్ ఏర్పాట్లు ఇలాంటివి చేయలేదు. ఇక విష్ణు చెప్పిన హామీలన్నీ ఖచ్చితంగా చేస్తాడు అంటూ చెప్పారు.

ఒక మనిషికి సెల్ఫ్ డబ్బా అవసరం అంటూ మాట్లాడారు. అయితే చేయకుండానే చేస్తా అని చెబితే అది సెల్ఫ్ డబ్బా అవుతుంది చేసే దాని చెబితే అది తప్పు కాదు. ఈ కాలంలో మనం చేసిన మంచి పనులు చెప్పుకోవాలి, అందరికీ తెలియాలి. రామాయణం లో హనుమంతుడు లంకలో ఉన్న సీత వద్ద నూరు కోతుల్లో నేను ఒకడిని అని చెప్పాడు అదే హనుమంతుడు రావణుడు కూర్చోడానికి కుర్చీ వేయకపోతే మొత్తం లంకను తగలబెట్టి తానేంటో చూపించాడు. సందర్భాన్ని బట్టి మనమేంటో చూపించుకోవాలి అది తప్పు కాదు అంటూ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.































