కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడు మాట్లాడినా ఎదో ఒక వివాదాస్పద విషయాలు బయటపెడుతూనే ఉంటారు. ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో మొత్తం అందరిని ఉతికి ఆరేశారు. ఇండిస్టీ లో వారసత్వం గురించి మాట్లాడిన అయన అసలు వారసత్వం అనే పదం తనకు నచ్చదని చెప్పిన మోహన్ బాబు. మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో తన అనుబంధాన్ని బయటపెట్టారు. మోడీ తనను బడే భాయ్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు కలెక్షన్ కింగ్… మరోవైపు మరికొన్ని ఇండస్ట్రీ గురించి సంచల వ్యాఖలు కూడా చేసారు.

ఇండిస్టీలో ఎవరికీ విలువలు లేవని, అసలు విలువలు ఉన్న మనిషి దొరకదని, అందరు అలానే మారిపోయారని చెప్పారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కొందరు మంచి వాళ్ళు ఉన్నా.. చాలా వరకు అందరు ఎథిక్స్ లేనివారే మన చుట్టూ తిరుగుతున్నారు అంటూ కామెంట్ చేసారు. అయినా అలా బ్రతకడం అలవాటు అయిపోయింది అందరికి.. మా అసోసియేషన్ కూడా సరిగాలేదని.. అక్కడకూడా కొందరు అటువంటి పనులకే ఉన్నరారని. అందుకే ఇటువంటి చిల్లరి పంచాయితీలకు నన్ను పిలవద్దని చిరంజీవితోపాటు మరికొందరికి చెప్పానని అన్నారు మోహన్ బాబు. మొత్తానికి కలెక్షన్ కింగ్ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశాలనే మాట్లాడతారు.




























