Connect with us

Featured

Mother builds temple for son : కొడుకు కోసం ఏకంగా గుడి కట్టిన తల్లి… రంజిత్ ఆఖరి కోరిక కోసం వచ్చిన ప్రభాస్…!

Published

on

Mother builds temple for son : ఏ తల్లి కైనా తన బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది. ఈ సృష్టిలో ఏ జీవి అయినా తమ బిడ్డల కోసం తమ ప్రాణాలను అడ్డువేసి రక్షించుకుంటారు. అలాంటి బిడ్డ తమ కల్ల ముందే మరణించినా తామేమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎదురైతే ఆ తల్లి గుండె తల్లడిల్లుతుంది. అలాంటి హృదయ విధారకరమైన విషయమే శ్రీనివాస్, జగదీశ్వరి దంపతులకు జరిగింది. చేతికి అందివచ్చిన కొడుకు తమ కళ్ళ ముందే మరణించడంతో క్రుంగిపోయారు. తమ బిడ్డను మర్చిపోలేక ఆ తల్లి ఏకంగా గుడి కట్టించాలని తమ బిడ్డను ఆ ఇంటి ఇలవేల్పు గా అనుకుని నిత్యం పూజలు చేస్తున్నారు.

రంజిత్ ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్…

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, జగదేశ్వరి దంపతులకు 1997లో రంజిత్ అనే బాబు పుట్టగా పుట్టినపుడే అతనికి కంటిలో రెటినా సమస్య ఉండటంతో పలు హాస్పిటల్స్ లో చికిత్స చేయించారు. బాబుకి ఆరేళ్ల వయసునుండి ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరగాడని, జ్వరం కూడా వచ్చిన దాఖలాలు లేవంటూ జగదేశ్వరి చెప్పారు. అలాంటి రంజిత్ ఏంబిఏ చేస్తుండగా అతనికి కంటి సమస్య మళ్ళీ వచ్చింది. ఒక కన్ను చూపు కూడా కోల్పోవడం జరిగిందని అయితే రేడియేషన్, కీమో అంటూ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తూనే ఉన్నామని పూరీ జగన్నాథ్ వైఫ్ లావణ్య ద్వారా వదిన ద్వారా బాలకృష్ణ గారి క్యాన్సర్ హాస్పిటల్ లో కుడా చూపించినా ఫలితం కనిపించలేదు. అప్పటికే కంటి రెటినాలో ఏర్పడిన సమస్య నరాల ద్వారా లంగ్స్ తరువాత గుండె వరకు వెళ్ళిపోయిందని డాక్టర్స్ చెప్పేసారు.

Advertisement

ఇక అలాంటి సమయంలో తనకి ఇష్టమైనవి చేయాలని డిసైడ్ అయి కొడుకుని అడిగితే ప్రభాస్ ని కలవాలని అడిగితే పూరీ జగన్నాథ్ అలాగే ఆయన భార్య లావణ్య ద్వారా ప్రభాస్ కి విషయం తెలిపి కలిసేలా ఏర్పాట్లు చేసాం అంటూ జగదేశ్వరి తెలిపారు. ప్రభాస్, తన కొడుకుని కలిసినపుడు తనకి ఏం ఇష్టమో అడిగి చికెన్ మంచూరియా ఇష్టమని అది తెప్పించి బాహుబలి లో ఏదైనా వస్తువు కావాలని అడిగితే ఆ ఏర్పాట్లు చేసారు అంటూ జగదశ్వరి తెలిపారు. అలా 25 ఏళ్లకే బిడ్డ మరణించడంతో తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ రూపాన్ని విగ్రహంగా మార్చి వాళ్ళ పొలంలో గుడి కట్టించారు. రాజస్థాన్ జైపూర్ నుండి విగ్రహం తయారు చేయించి వారి పొలంలో 15 లక్షలు వరకు ఖర్చుచేసి గుడి కట్టించారు. తమ ఇంటి దైవంగా కొడుకుని నిత్యం పూజిస్తున్నారు ఆ తల్లి.

Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!