ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శిఖరాలలో ఒకటీ. ఈ ఎవరెస్టు శిఖరం నేపాల్ లో వుంది,దీనిని అధిరోహించడానికి ప్రతి సంవత్సారం నేపాల్ కి వందలాది మంది పర్యాటకులు వెళ్తూవుంటారు.అయితే నేపాల్ ప్రభుత్వం ఎవరెస్టు అధిరోహించేవారికి కొత్త ప్రతిపాధనలన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఎవరెస్టు శిఖరం ఎక్కాలంటే 11 వేల డాలర్లు చెల్లించాల్సి వచ్చేది,తాజాగా ఆ ఫీజు ను 15 వేల డాలర్లుకు (ఇండియన్ కరెన్సీ లో దాదాపు 13 లక్షలు )పెంచినట్లు టూరిజం శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ ప్రసాద్ వెల్లడించారు. పది సంవత్సారాలు గ ఈ ఫీజులని సవరించలేదని అందుకే కొత్త ప్రతిపాదనలు సెప్టెంబర్ 2025 నుండి అమలలోకి వస్తాయని తెలిపారు.

అంతేకాకుండా పర్వతారోహణకు వచ్చేవారికి ఒక్కో సీజన్ కి ఒక్కో ఫీజుని కేటాయించారు,తక్కువ పాపులారిటీ వున్నా సెప్టెంబర్_నవంబర్ సీసన్ కి 7,500 (రూ .6.47 లక్షలు ) డాలర్లు, డిసెంబర్_ ఫిబ్రవరి సీజన్ ఫీజును 3,750 డాలర్లు(రూ 3.23 లక్షలు) గా పెంచినట్లు తెలిపారు. ఈ పెంచిన ఫీజులని ప్రభుత్వం ఎవరెస్ట్ పరిశుభ్రతకు ఉపయోగిస్తుందని టూరిజం అధికారులు తెలియజేసారు..నేపాల్ కి అధిక సంఖ్యలో వచ్చే టూరిస్టులు ఎవరెస్టు ని అధిరోహించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే టూరిజం శాఖా మాత్రం ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రతి ఏడాది 300 మందికి మాత్రం అవకాశం కల్పిస్తుంది.



























