సంచలన నిర్ణయం తీసుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని. తాజాగా శనివారం సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించాడు. ఈ సందర్భంగా తన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపాడు. వన్డే, టెస్ట్ సహా టీ20లతో పాటు అన్ని ఫార్మట్ల వీడ్కోలు పలికారు మిస్టర్ కూల్. ధోనీ చివరాగా న్యూజిలాండ్ జట్టుపై 2019 వరల్డ్ కప్లో ఆడాడు. జులై 19న ఆడిన ఆ మ్యాచ్ ధోనీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్.

2004లో టీమిండియా జట్టులోకి వికెట్ కీపర్ గా అరంగ్రేటం చేసిన ధోని, అదే సంవత్సరం డిసెంబర్ 23న బంగ్లాదేశ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. కాగా, ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ లో ధోని ఆడాల్సి ఉంది అయినా ప్రస్తుత కరోనా నేపథ్యంలో అది కాస్త వాయిదా పడింది. అయితే ఐపీఎల్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నడని భావిస్తున్నారు. సెప్టెంబర్లో మొదలవబోతున్న ఐపీఎల్ టోర్నీలో ధోనీ మెరుపులు మాత్రం అభిమానులు చూడవచ్చు.




























