Producer MS Raju : 1990-2000 దశకంలో తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత ఎమ్మెస్ రాజు తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నిర్మాతల్లో ఒకరు. విక్టరీ వెంకటేష్ తో చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టిన ఎమ్మెస్ రాజు సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ… ఎమ్మెస్ రాజు పేరుతో ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
మొదటి చిత్రంతో విజయాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత విజయశాంతితో ‘పోలీస్ లాకప్’ సినిమా రూపొందించినప్పటికీ ఆమెతో ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ‘దేవి’ సినిమాతో కొంత ఉపశమనం పొందగా వెంకటేష్ తో రెండోసారి తీసిన చిత్రం ‘దేవి పుత్రుడు’ ఆయనను పునరాలోచించేలా చేసింది. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా ‘మనసంతానువ్వే’ చిత్రాన్ని నిర్మించి మరో విజయవంతమైన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఆయన గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘ఒక్కడు’ చిత్రం రూపొందించగా..మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మూడవ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తెలంగాణ నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన రచయిత వీరుపోట్ల చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్, త్రిష హీరో, హీరోయిన్స్ గా చారిత్రక నేపథ్యం గల వరంగల్, ఆ నగరం చుట్టూ పరిసర ప్రాంతాలను ఆధారం చేసుకుని దర్శకుడు శోభన్ తీసిన చిత్రం “వర్షం” 2004 జనవరిలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన గీతాలు యువత గుండెల్లో మార్మోగాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. అనే పాటను స్వరపరిచిన దేవిశ్రీప్రసాద్ కు ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటకు త్రిష వేసిన స్టెప్పులకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు.
అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఎమ్మెస్ రాజుకు.. ఆ జ్ఞాపకాలు తన మదిలో నుంచి పోలేదు. దాదాపుగా అదే టైటిల్ తో మళ్లీ వర్షం నేపథ్యంగా మరో చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.. ఆ క్రమంలో 2008 సుమంత్ ఆర్ట్స్ నిర్మాణం, ఎమ్మెస్.రాజు నిర్మాత, దర్శకత్వంలో ‘వాన’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో వినయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒక విధంగా వర్షం సినిమాతో పీక్ లో ఉన్న ఎమ్మెస్.రాజు ‘వాన’ సినిమా నిర్మించి చేతులు కాల్చుకున్నారు.
MS Raju : దర్శకుడిగా మారినా ఫలితం దక్కలేదు
‘వర్షం’ చిత్రంతో వచ్చిన డబ్బులు కాస్త..’వాన’ చిత్రంతో ఊడ్చుకు పోయాయి. ఆ తరువాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తూ.. తన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా “తూనీగా తూనీగా” చిత్రం తీయగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ బాధ్యతలతో పాటు దర్శకత్వం వహిస్తూ.. శ్రవణ్ రెడ్డి, రుహానిశర్మ,సిమ్రత్ కౌర్ హీరో, హీరోయిన్లుగా”డర్టీ హరి” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయింది.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.