ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత, నాగచైతన్య ప్రేమగా మారింది. కొన్నాళ్లు ఇరువురి కటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరివురు విడిపోతున్నారని.. గొడవలు తారాస్థాయికి చేరడంతో విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వాటిని సమంత గానీ, చైతు గానే ఏనాడు ఖండించలేదు. అందుకే సోషల్ మీడియాలో ఆ ఆరోపణలు బలాన్ని చేకూరుస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
సమంత ఫ్యామిలీ కంటే.. సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో చైతు సీరియస్ గా ఉన్నట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరిద్దరిని పెద్దలు కూర్చోబెట్టి రాజీ కుదిర్చినా కుదరలేదట. దీంతో విడాకుల మంజూరు కార్యక్రమం కూడా పూర్తి కావస్తుందనేది వార్తలు వస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా.. సమంత త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కానుందట.
అక్కడకు వెళ్లి బాలివుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టనుందంటూ తెలుస్తోంది. విడాకులు మంజూరు కావడానికి కొంత సమయం పడుతుండటంతో.. తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే దీనిపై నాగార్జును ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు అఖిల్ కూడా ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయితో బ్రేకప్ కావడం.. నాగచైతన్య పరిస్థితి ఇలా కావడంతో బిగ్ బాస్ లో అతడు అంత జోష్ ఫుల్ గా కనిపించలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
లవ్ స్టోరీ ట్రైలర్ కు సంబంధించి నాగ చైతన్య ట్వీట్ చేయగా.. దానికి సమంత రీ ట్వీట్ చేసి.. ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు. దానికి థ్యాంక్యూ అంటూ సమంత ట్వీట్ కు చైతు రీ ట్వీట్ చేశాడు. అయితే సమంత కేవలం సాయిపల్లవి, లవ్ స్టోరీ టీంకు మాత్రమే యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్ చేయగా.. చైతన్యకు మాత్రం పెట్టలేదు. దీంతో అభిమానులు మరింత సందగ్ధంలో పడిపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…