Namrata:సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత అనంతరం మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసిందని అందరికీ తెలిసిందే.
మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రత మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను మొదటిసారి షూటింగ్ లొకేషన్లో మహేష్ బాబుని చూడగానే ఈయన ఏంటి ఇంత రిజర్వ్డ్ గా ఉన్నారు అనే భావన తనలో కలిగిందని నమ్రత వెల్లడించారు.
ఎలాగైనా ఇతనిలో ఉన్నటువంటి ఆ రిజర్వ్డ్ నెస్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి అందులో విజయం సాధించానని తెలిపారు.ఇలా మహేష్ బాబుతో తనకు పరిచయం ఏర్పడటం ఆ పరిచయం మెల్లిగా ప్రేమకు దారి తీయడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మహేష్ బాబుతో కనుక ఉంటే రోజులు గడిచి పోయేవి కూడా తెలియదని ఈమె తెలిపారు. ఆయన సినిమాలలో మాత్రమే నటిస్తారు నిజ జీవితంలో నటించరని మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలిపారు.
ఇక మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి, మురారి, ఒక్కడు సినిమాలంటే చాలా ఇష్టం.ముఖ్యంగా మురారి సినిమాలో మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటారు. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని నమ్రత తెలిపారు.మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత తనకు హీరోయిన్ గా ఉండడం కన్నా మహేష్ బాబుకు భార్యగా ఉండటమే ఇష్టమని అందుకే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.ఇలా నమ్రత మహేష్ బాబు గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…