Natti Kumar : సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంఘర్షణ నిర్మాతల సమస్యల కోసం సినిమా షూటింగులను బంద్ చేసారు. అయితే సమస్య సినిమా షూటింగులను బంద్ చేస్తే తీరిపోతాయా అన్నదే ప్రశ్న. నిర్మాతల గిల్డ్ ఏకపక్షంగా తీసుకున్న సినిమా షూటింగ్ ల బంద్ నిర్ణయం మీద అన్నివైపుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే హీరోలు, పెద్ద ఆర్టిస్టులు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సమస్య తీరుతుంది అని భావిస్తే అది తప్పు అంటూ సినిమా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఇష్యూ మీద నట్టి కుమార్ మరోసారి స్పందించారు. ఆగష్టు 15 తర్వాత నుండి ఎవరు ఏమి చేసినా మా షూటింగులు మొదలవుతాయి అంటూ బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించడంతో ఇపుడు ఇండస్ట్రీ లో ఏమి జరుగుతోంది అనే అంశాలపై నట్టి కుమార్ స్పందించారు.

బాలకృష్ణ, మహేష్ కి ఉన్న ధైర్యం మిగతా వాళ్లకు లేదా…
షూటింగుల బంద్ వల్ల నష్టం కార్మికులకు చిన్న సినిమా నిర్మాతలకే కానీ మిగతా వాళ్లమీద పెద్దగా ప్రభావం చూపదు. ఇన్నిరోజులు షూటింగులు బంద్ చేసి గిల్డ్ నిర్మాతలు ఏమి సాధించారు. ఒక్క సమస్యకైనా పరిష్కారం దొరికిందా.. ఎవరి దగ్గరికి వెళ్లి చర్చించారు అంటూ నట్టి కుమార్ ఫైర్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలతో మీ సమస్యలను చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోయేదానికి షూటింగులను ఎందుకు బంద్ చేయాలి. పెద్ద హీరోలకు షూటింగుల బంద్ వల్ల ఏమీ జరగదు కానీ ఒక చిన్న సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ ను పెట్టుకోవాలన్నపుడు షూటింగుల బంద్ వల్ల మళ్ళీ డేట్స్, కాంబినేషన్స్ సెట్ చేసుకోవాలంటే ఒక చిన్న నిర్మాతకు మూడు నెలలు సమయం పడుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది.

ఇక రోజూ ఇండస్ట్రీ ని నమ్ముకుని పని చేస్తున్న కార్మికులు నష్టపోతున్నారు అంతే అని కామెంట్స్ చేసారు. ఇక మా షూటింగ్ ఆగష్టు 15 తర్వాత ప్రారంభిస్తున్నాం అంటూ ఇప్పటికే బాలకృష్ణ, మహేష్ బాబు ప్రకటించేసారు. అయితే మిగతా పెద్ద హీరోలు ఎందుకు మౌనంగా ఉన్నారు. చిరంజీవి లాంటి పెద్ద హీరో వద్దకు వెళ్లి సమస్యలకు పరిష్కారం చర్చించి మిగతా హీరోలను ఒప్పించిండవచ్చు కానీ అలాంటి చర్యలేవి తీసుకోలేదు. ఇక ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే వాళ్ళు కూడా చొరవ చూపడం లేదు, అందరూ కలిసి కార్మికుల పొట్ట కొడుతున్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు ఉంది అంటూ నట్టి అభిప్రాయపడ్డారు.

































