సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ నయనతార. ఓవర్ నైట్ లో ఈమెకు ఈ స్టార్ డం రాలేదు. తన ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది ఆవిడ. కమర్షియల్ సినిమాలలో గ్లామర్ మెరుపులు మెరిపించినా, లేక చీరకట్టులో పద్ధతిగా కనిపించిన, లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన అది సౌత్ ఇండియాలో నయనతారకు మాత్రం సరిగ్గా సరిపోతుంది.
అసలు స్టార్ హీరోల సినిమాల తరహాలోనే నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు డబ్బుల వర్షం కురిపించాయి. 35 ఏళ్ళ వయసులో కూడా నయనతార వన్నె తరగని అందంతో కొనసాగుతుంది. తన జీవితంలో ఎన్ని విమర్శలు ఎదురైనా నయనతార తన దారిలో తను పయనిస్తూనే ముందుకు వెళుతుంది. ఇక పోతే తన నిజజీవితంలో సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక 2 ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను నయనతార అనుభవించడం జరిగింది. నటుడు ప్రభుదేవా, తమిళ నటుడు శింబుతో గతంలో నయనతార ప్రేమలో పడి లవ్ ఫెయిల్యూర్ చవిచూసింది. అయితే నటుడు ప్రభుదేవా తో పెళ్లి చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్న కూడా చివరికి ప్రభుదేవా మొదటి భార్య వల్ల వారు పెళ్లి చేసుకోకుండా విడిపోవడం జరిగింది.
ఇక మరో లవ్ స్టోరీ తమిళ నటుడు శింబుతో జరిగింది. నిజంగా శింబూ ఒక ప్లే బాయ్. ఆయనతో సినిమా చేసే హీరోయిన్ల విషయంలో ఎప్పుడు పార్టీలు, వారితో సరదాగా ఉండటం ఇలా చేస్తూ ఉంటాడు. అయితే శింబు – నయనతార విషయంలో కాస్త చొరవ ఎక్కువ తీసుకొని ముందుకు నడిచారు. కాకపోతే ఈ విషయంలో నటుడు శింబు తండ్రి ఒప్పుకోకపోవడంతో వారి పెళ్లి కూడా పెళ్లి పెటాకులు అయింది. దీనితో నయనతార 2 లవ్ ఫెయిల్యూర్ లను మోయాల్సి వచ్చింది.
అయితే ఒకసారి ఆవిడ మాట్లాడుతూ… నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు… నమ్మకం లేకుండా కలిసి ఉండటం కంటే విడిపోవడమే బెటర్ అని తెలిపింది. నిజానికి ప్రభుదేవా, శింబుతో విడిపోవడానికి కారణం అదేనని ఆ సమయంలో నేను ఎంతో వేదన అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అని తెలిపింది. అయితే ఈ విషయంలో మీడియా నేను నోరు మెదపక పోవటంతో వారికి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేశారు అని కూడా ఆవిడ మాట్లాడారు.ఇక శింబు తో విడిపోయి ప్రభుదేవాతో కొన్నాళ్ళు ప్రేమాయణం బాగానే సాగిన ఆ తర్వాత కొన్నాళ్ళకు ప్రభుదేవా పెట్టిన కండిషన్స్ తో నయన్ ఈ ప్రేమకు కూడా స్వస్తి చెప్పింది. మొదటగా క్రిష్టియన్ గా ఉన్న నయన్ ప్రభుదేవా కండిషన్ వల్లనే హిందువుగా మారిందట ..ఆ తర్వాత రాను రాను ప్రభు దేవా ఆధిపత్యం మరియు షరతుల వల్ల ఆ బంధం కూడా బీటలు వారింది
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.