బిహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ జిల్లాలో ఓ యువతికి మూడు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఆ దంపతులు మూడు నెలలు అన్యోన్యంగా ఉన్నారు. కొత్త పెళ్లికూతురు కూడా వాళ్ల ఇంట్లో వారితో బాగానే కలివిడిగా ఉంది. తన అత్త ఇంటి నుంచి ఆమె రక్షాబంధన్ రోజున బంధువుల ఇంటికి వెళ్లింది.

అక్కడ నుంచి పాట్నాలోని షాపింగ్ కు ఆమె తల్లితో వెళ్లిన ఆ యువతి కనిపించకుండా పోయింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆమె ఇంట్లో బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఓ వ్యక్తితో పారిపోయినట్లుగా తెలిసింది.
భోజ్పూర్లోని కిషున్పూర్ గ్రామానికి చెందిన సింటు కుమార్తో ఆమె పారిపోయినట్లుగా తాము అనుమానిస్తున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు పెళ్లి కాకముందు అతడితో మాట్లాడేదని.. అతడే ఈ పని చేసి ఉంటాడని పేర్కొన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా.. రక్షాబంధన్ అయిపోయి రెండు రోజులు అయినా.. కోడలు ఇంటికి రాలేదని.. ఇంటికి పంపించాలని తన అత్త వాళ్ల ఇంటికి ఫోన్ చేసి అడగడంతో వాళ్లు కంగారు పడ్డారు. విషయం ఎలా చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో జరుగుతూనే ఉన్నాయి.. వారిని కన్న తల్లిదండ్రులను కన్నీటిని మిగుల్చుతూనే ఉన్నారు.
































