హీరో నితిన్ భీష్మ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా రష్మిక నటించింది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చేయనున్నారట. ఈ మధ్య హిట్ అయినా ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి అని సమాచారం. అయితే ఈ చిత్రంలో కథానాయకుడిగా బాలీవుడ్ నటుడు రణభీర్ కపూర్ నటించనున్నారు. మరోవైపు భీష్మ భారీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించింది హీరో నితిన్ తన మార్క్ కామెడీ టైమింగ్ ఈ విజయానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో రణభీర్ తన మార్క్ కామెడీతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడు అనేది చూడాలి.




























