Nivetha Pethuraj: నివేత పేతురాజ్ నటుడు విశ్వక్ తో కలిసి ఈమె పాగల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తిరిగి ఈ జంట తాజాగా విడుదలైన దాస్ కీ ధమ్కీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి నివేత ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ప్రభుదేవాతో ఓ తమిళ సినిమా చేస్తున్నప్పుడు ‘నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావు’ అని అడిగారట. ‘బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్’ అని చెప్పారని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గ్లామర్ షో చేయాలంటే కాస్త భయం వేసిందని ఈ సినిమా కోసం తాను పూర్తిగా శరీర బరువు తగ్గానని తెలిపారు.
దాస్ కీ ధమ్కీ సినిమా కోసం తాను ఎంతో కష్టపడి పూర్తిగా తన స్టైల్ మొత్తం మార్చుకున్నానని తెలిపారు. ఇక ఇందులో పాటలు కొన్ని సన్నివేశాలను అమ్మకు పంపించడంతో తన తల్లి కూడా ఇందులో చాలా అద్భుతంగా నటించానని మెచ్చుకున్నారని వెల్లడించారు. సాధారణంగా హీరోలు సినిమాలను నిర్మిస్తూ ఉంటారు కానీ విశ్వక్ మాత్రం సినిమాకు డైరెక్షన్ చేశారు. తన డైరెక్షన్లో వేరే హీరోతో సినిమా చేయొచ్చు కదా అని తనకు సలహా ఇచ్చానని తెలిపారు.

Nivetha Pethuraj:సౌందర్య బయోపిక్ చిత్రం…
విశ్వక్కి గ్యాంగ్స్టర్ సినిమాలంటే పిచ్చి. అప్పుడప్పుడూ కొన్ని కథలు కూడా వినిపించారని ఈమె తెలియజేశారు ఇక తాను బయోపిక్ సినిమాల గురించి మాట్లాడుతూ తనకు ఆస్ట్రానట్ కల్పనా చావ్లా బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని తెలిపారు. ఇక సౌందర్య బయోపిక్ చిత్రంలో కూడా చేయాలని ఉంది కానీ ఆ బయోపిక్ చిత్రంలో నిత్యమీనన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అంటూ ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు.































