ప్రస్తుతం కరోనా థర్డ్వేవ్ పై అనేక రకాల వార్తలు వస్తున్న వార్తలపై కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, నీతీ అయోగ్ మెంబర్ వీకే పాల్ స్పందిచారు.. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం థర్డ్వేవ్ పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపదు. కరోనా థర్డ్వేవ్ పిల్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనటానికి ఎటువంటి ఆధారల్లేవని మీడియాకు ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం చిన్న పిల్లలకు సంబంధించి కరోనా కేసులు పెరుగుతుండంతో ఆందోళన చెందుతున్నారు. కానీ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు’ అని ఆయన చెప్పారు. ‘అడల్డ్లో సిరోప్రివలెన్స్ ఎలా ఉందో పిల్లల్లో కూడా అలానే ఉంది.. అంటే పెద్ద వాళ్లలాగే పిల్లలు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంది. అది తప్పితే ప్రత్యేకంగా పిల్లలపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పడానికి ఇప్పటి వరకు మనకు ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు’ అని ఆయన తెలిపారు.



























