NTR : నందమూరి కుటుంబం అంటే అటు రాజకీయ పరంగా ఇటు సినిమా పరంగా సమాజంలో చాలా గుర్తింపు వుంది. వీరి కుటుంబంలో అందరు ఆయా రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలాంటి నందమూరి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామ రావు చిన్న కూతురు ఉమా మహేశ్వరి అనారోగ్యం, మానసిక ఒత్తిడి కారణంగా 52 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులయతో పాటు అందరినీ కలచి వేసింది. ఈరోజు ఉమా మహేశ్వరికి కుటుంబ సభ్యులు కాన్నీటి వీడ్కోలు చెప్పారు.

అంత్యక్రియలకు హాజరుకాని ఎన్టీఆర్…
కంఠమనేని ఉమా మహేశ్వరి కడసారి చూపు కోసం నందమూరి కుటుంబం మొత్తం కదలి వచ్చింది. లోకేష్, చంద్ర బాబు నాయుడు, భువనేశ్వరి బాలకృష్ణ కుటుంబం ఇలా అందరూ దగ్గరుండి చూసుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా హాజరు అయ్యారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వారి అత్తయ్య ఆఖరి చూపుకు రాలేదు.

ఉమా మహేశ్వరి అంత్యక్రియలలో అందరూ పాల్గొన్నారు. కుటుంబం మొత్తం అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే అంత్యక్రియలకు అయినా ఎన్టీఆర్ హాజరు అవుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రాలేదు. అయితే ఎన్టీఆర్ రాకపోవడంపై నెటిజన్లు చాలా అనుమానలు వ్యక్తపరుస్తున్నారు. కొందరు నందమూరి వంశంలోని విబేధాల కారణంగానే ఎన్టీఆర్ హాజరు కాలేదు అంటున్నారు. ఇంకొందరు విదేశాలకు వెళ్లడం కారణంగా హాజరు అవ్వలేక పోయారు అంటున్నారు.



































