Connect with us

Featured

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

Published

on

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దాదాపుగా ఆయన వేయని పాత్ర అంటూ ఇక లేదేమో అనిపిస్తుంది. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో తన నటనా కౌశలంతో అద్భుతమైన పాత్రలు ధరించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. సర్దార్ పాపారాయుడు చిత్రంలో స్వతంత్ర సమరయోధుడిగా, జస్టిస్ చౌదరిలో న్యాయమూర్తిగా, కొండవీటి సింహంలో బాధ్యతాయుతమైన పోలీసాఫీసర్ గా, బొబ్బులిపులిలో దేశ సేవలో పునీతుడైయిన మేజర్ చక్రధర్ పాత్రలలో.. ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఈ నాలుగు పాత్రలు కీలక భూమికను పోషిస్తాయి.

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

అలాంటి అద్భుతమైన పాత్రలను పోషించి సమాజంలో ఉన్న అవినీతి, అన్యాయం లాంటి అప్రజాస్వామ్య విధానాలను కూకటివేళ్ళతో పెకిలించారు. బెబ్బులిపులి చిత్రం నిర్మిస్తున్న వడ్డే రమేష్ కథ, సంభాషణలు దాసరి రాసుకుంటున్న క్రమంలో.. మిగతా సాంఘిక చిత్రాల కంటే భిన్నంగా బొబ్బులిపులి సినిమా క్లైమాక్స్ ఉండాలి. అది చరిత్రలో మర్చిపోని సన్నివేశం కావాలని దాసరితో వడ్డే రమేష్ చెప్పారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న దాసరి ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏవిఎమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశారు. ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ సెట్ కు వస్తారు. దాసరి నారాయణరావు ఎనిమిది గంటలకే లొకేషన్ లో ఉన్నారు. ఎందుకనో కోర్టు సీన్ ఇంకా బాగా రావాలనే ఉద్దేశంతో రాసిన పేపర్స్ పక్కకు పెట్టి కొత్త సంభాషణలు దాసరి రాయడం ప్రారంభించారు.

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

సరిగ్గా తొమ్మిది గంటలకు అన్నగారు లోకేషన్ కు వచ్చారు. సిన్సియర్ గా డైలాగ్స్ రాస్తున్న దాసరిని ఇబ్బంది పెట్టకుండా సెట్లో ఓ మూలాన కూర్చున్నారు. దాదాపు 35 పేజీలతో కోర్టు సన్నివేశాలు, సంభాషణలు ఉ.11 గంటల వరకు రాశారు. లేచి చూసే సరికి అక్కడ ఎన్టీఆర్ కనిపించారు. మేము గమనించాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనే అలా పక్కనే కూర్చున్నామని చెప్పడంతో.. దాసరి రాసిన ఎమోషనల్ డైలాగ్స్ ఒకసారి ఎన్టీఆర్ కి వినిపించారు. ఆయన ఏమీ మాట్లాడకుండా.. షూటింగ్ మధ్యాహ్నం పెట్టుకుందామని ఎన్టీఆర్ అనడంతో దాసరి, ఎన్టీఆర్ కు ఏదైనా పని ఉండవచ్చని భావించారు. కానీ ఆ డైలాగ్స్ పేపర్స్ తీసుకుని ఎన్టీఆర్ చెన్నైలోని మెరీనాబీచ్ కి వెళ్లారు. ఎవరూ లేని చోటుకి వెళ్లి ఆ సంభాషణలు ప్రాక్టీస్ చేశారు. తిరిగి మధ్యాహ్నం లొకేషన్ (ఏవిఎమ్ స్టూడియో)కు చేరుకున్నారు.

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

కోర్టులో శ్రీదేవి న్యాయవాదిగా కేసుకు సంబంధించిన వివిధ ప్రశ్నలతో ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తుంది. ఈ వాదనల అనంతరం.. నేను పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా యువరానర్ అని మేజర్ చక్రధర్(ఎన్టీఆర్) ప్రశ్నించగా.. అవును అని న్యాయమూర్తి సమాధానమిస్తారు. పై కోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్ అని అడుగగా.. శిక్ష తగ్గించవచ్చు లేదా ఇదే శిక్ష ఖరారు చేయవచ్చు అని న్యాయమూర్తి బదులిస్తారు… ఈ కోర్టు వేసిన శిక్షను ఆ పై కోర్టులో పోవచ్చు లేదా ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా అదే శిక్ష ఖరారు కావచ్చు.. అంటే ఒక కోర్టుకి మరొక కోర్టు కి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.. ఇలా కోర్టు కోర్టు కు తీర్పు తీర్పు కి ఇంత మార్పు ఉంటే.. మీ కోర్టులో న్యాయం ఉన్నట్టా యువరానర్.. ఒక్కొక్క కోర్టుకి ఒక్కో తీర్పు ఉండడం చేతనే నేరస్తుడు తను చేసిన నేరం మర్చిపోయాకగాని శిక్ష పడుతుంది..

NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!

తెలివిగల పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామరాజును చంపావా? భీమరాజును చంపావా? అంటూ అడిగారేగాని వారిని ఎందుకు చంపావు? అని ఎందుకు అడగలేదు యువరానర్.. అంటూ మేజర్ చక్రధర్ పాత్రలో ఎన్టీఆర్ తన వాక్పటిమతో, కోర్టు హాలు దద్దరిల్లేలా ప్రత్యేక డైలాగ్ డిక్షన్ తో వీరవిజృంభణ చేశారు. 15 నిమిషాల నిడివి గల ఆ కోర్ట్ సన్నివేశం చూస్తున్న సగటు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అన్నగారి నటనకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ ఒక్క సన్నివేశం తోనే బొబ్బులిపులి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత వచ్చిన అనేక తెలుగు చిత్రాలకు ఈ కోర్టు సీన్ ఒక ప్రేరణగా నిలిచింది.

Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!