సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన రామారావు ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. రామారావు నటించిన ఎన్నో సినిమాలలో డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. నిజానికి సింగీతం శ్రీనివాస్ దర్శకధీరుడు కె.వి.రెడ్డి శిష్యునిగా ఇండస్ట్రీలోకి “మాయాబజార్” సమయంలోనే అడుగు పెట్టారు.
ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాస్ ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ తో సినిమా తీయాలనే ఆశ అలాగే మిగిలిపోయింది. కానీ ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా మూడు సినిమాలను తెరకెక్కించారు. ఇందులో రెండు సినిమాలు సూపర్ హిట్ కాగా ఒకటి మాత్రం ఫ్లాప్ సినిమాగా నిలబడిపోయింది. గత కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో సింగీతం శ్రీనివాస్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బాలకృష్ణ హీరోగా “ఆదిత్య 369”, “భైరవ ద్వీపం” “కృష్ణార్జున యుద్ధం” సినిమాలను తెరకెక్కించారు. సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ అచ్చం ఎన్టీ రామారావు గారి ఆలోచనా విధానాన్ని అతని పద్దతులను ఆచరించే వారిని శ్రీనివాస్ తెలియజేశారు. ఎన్టీఆర్ గారు పౌరాణిక వేషాలు వేసేటప్పుడు ఖాళీ సమయంలో తనపై ఉన్న నగలను తీయకుండా సాయంత్రం షూటింగ్ కి ప్యాకప్ చెప్పే సమయం వరక ఒంటిపై అలాగే వేసుకునేవారు, వాటిని తీసేస్తే మరి వేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పేవారు. అచ్చం బాలకృష్ణ కూడా అదే పద్ధతులను అనుసరించేవారు.
ఆదిత్య 369 సినిమా షూటింగ్ జరిగేటప్పుడు భవిష్యత్ కాలం షాట్స్ తీసేటప్పుడు లైటింగ్ సెట్ చేసుకోవడానికి కాస్త సమయం ఎక్కువ పట్టేది. ఈ క్రమంలోనే సెట్స్ కి వచ్చిన ఆర్టిస్టులందరూ ఖాళీగా కూర్చునేవారు. అందుకోసమే బాలకృష్ణ గారిని కాస్త ఆలస్యంగా సెట్ కి రమ్మని చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఇంట్లో కూర్చొని ఉండడంతో ఎన్టీఆర్ తన దగ్గరకు వెళ్లి ఏంటి షూటింగ్ లేదా అని అడిగారట.. ఉంది డైరెక్టర్ గారు ఆలస్యంగా రమ్మన్నారని బాలకృష్ణ చెప్పడంతో నిర్మాతలు మనకు డబ్బులు ఇచ్చేది వారికి ఎప్పుడూ మనం అందుబాటులో ఉండటం కోసమే ముందు మేకప్ వేసుకుని షూటింగ్ కి వెళ్ళు అంటూ ఆర్డర్ వేయడంతో బాలకృష్ణ వెంటనే షూటింగ్ కి వచ్చారని, అది అన్నగారి పద్ధతి ఆ పద్ధతినే బాలకృష్ణ కూడా అనుసరిస్తూ వచ్చారని ఓ సందర్భంలో సింగీతం శ్రీనివాస్ వెల్లడించారు.
ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే…
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త డైట్ పద్ధతులు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. అందులో ఒకటి ‘వాటర్…
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
ఇటీవలి కాలంలో చిన్నారులను ప్రభావితం చేసే అరుదైన వ్యాధులలో Spinal Muscular Atrophy (ఎస్ఎంఏ) గురించి తరచూ వార్తల్లో వినిపిస్తోంది.…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…