Connect with us

Featured

మన టాలీవుడ్ తారలు – బంధుత్వాలు !!

Published

on

టాలీవుడ్ లో ఎంతోమంది గొప్ప నటీనటులు, దర్శకులు, మరెందరో కళాకారులున్నారు. కేవలం సినిమాపై వున్న మమకారంతో వారందరూ ఎన్నో అష్టకష్టాలు పడి తెలుగు చిత్రసీమకు పరిచయమౌతున్నారు. అయితే టాలీవుడ్ లోనే ఒకే కుటుంబం నుండి కొందరు నటీనటులు, కళాకారులు పరిచయమయ్యారు.

కానీ వాళ్ళమధ్య వున్న బంధుత్వాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. అందుకే టాలీవుడ్ లో వుంటూ మంచి గుర్తింపు ను సంపాదించుకున్న కొందరి సినీ ప్రముఖుల బంధుత్వాల గురించి ఇప్పుడు చదివి తెలుసుకోండి.

టాలీవుడ్ లో చోటా కె నాయుడు గారి కెమెరా పనితనం గురించి చెప్పనక్కర్లేదు , ఆయన హీరోలని చాలా బాగా చూపిస్తారనే మంచి పేరుంది. చోటా కె నాయుడికి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ హీరో గా నటించి చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.

అలనాటి మహానటి సావిత్రి, ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేఖ ఇద్దరూ తల్లీ కూతుళ్లు అవుతారు. సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్న జెమిని గణేశన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురే రేఖ.

గోపిచంద్, శ్రీకాంత్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచున్న శ్రీకాంత్ కి హీరో గోపిచంద్ బంధువేనన్న సంగతి చాలామందికి తెలియదు. గోపిచంద్ శ్రీకాంత్ గారి మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు.

విశ్వ నటుడు కమల్ హాసన్, సహజ నటి సుహాసిని ల బంధుత్వం కోసం చెప్పాలంటే.. సుహాసినికి కమల్ స్వయానా బాబాయ్ అవుతారు. కమల్ అన్నయ్య చారు హాసన్ కూడా నటుడే. చారుహాసన్ కూతురే సుహాసిని. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నంని 1988లో ఈమె పెళ్ళి చేసుకున్నారు.

కళాతపస్వి కె విశ్వనాధ్, నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు. అందుకే తన సినిమాల్లో చంద్రమోహన్ ని విశ్వనాధ్ ఎక్కువగా ప్రోత్సాహించేవారు.

అలనాటి మేటి నటి, టాలీవుడ్ డైరెక్టర్ విజయ నిర్మల, సహజనటి జయసుధకు వరుసకు అత్తవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “పండంటి కాపురం” చిత్రం ద్వారా జయసుధ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అందాల తార శ్రీదేవి ఒక్క టాలీవుడ్ లోనే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే గొప్ప నటి. అలాగే గులాబీ, పెళ్లిలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేశ్వరి, శ్రీదేవి దగ్గరి బంధువులు. శ్రీదేవికి మహేశ్వరి మేనకోడలి వరుస అవుతుంది.

మతం మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్, జివి ప్రకాష్ ల మధ్య బంధం ఏమిటంటే.. సంగీత దర్శకునిగా పరిచయమై, హీరోగా మారిన ప్రకాష్, స్వయంగా రెహ్మాన్ సొంత అక్క కొడుకే.

టాలీవుడ్ లో పెద్ద కుటుంబాలుగా చెప్పుకునే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలో వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ గారు, నాగార్జున గారు మాజీ దంపతులు. వీరి కుమారుడే నాగ చైతన్య. వెంకటేష్ నాగార్జునలు సొంత బావ మరుదులు. కొన్ని కారణాల వల్ల నాగార్జున మొదటి భార్యతో విడాకులు తీసుకున్నప్పటికీ వీరి మధ్య మంచి స్నేహమే ఉంది.

‘సాహో’ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో నటించిన అరుణ్ విజయ్ ఎవరంటే, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్య కొడుకు. ఇక మొదటి భార్య చనిపోయాక మంజులను పెళ్లాడారు. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్లు ప్రీతి, ,శ్రీదేవి వీరి సంతానమే.

వందకు పైగా సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకులు కీరవాణి గారు, అలాగే తెలుగు దర్శకుల సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు S.S రాజమౌళి గారూ వీరిద్దరూ అన్నదమ్ముళ్లే. కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి. రాజమౌళి గారూ తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణిగారు.

బాలీవుడ్ లో తన అసమాన ప్రతిభను చాటిన నటి విద్యాబాలన్, తెలుగులో పలు భాషల్లో నటించిన ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అవుతారు. అలాగే ప్రముఖ గాయని మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడలు అవుతుంది.

హీరో రామ్, శర్వానంద్ ఇద్దరు తెలుగు సినిమాలో రాణిస్తున్న యువ హీరోలే. అయితే వీరిద్దరు దగ్గరి బంధువులు అన్న సంగతి మీకు తెలుసా.? అవును రామ్ పోతినేనికి శర్వానంద్ బావ వరుస అవుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ షబానా అజ్మీ ,టబు బంధం గురించి చెప్పాలంటే, షబానా అన్న కూతురే టబు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీహరి గారు కలిసి చాలా సినిమాలలో కలసి నటించారు. టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేశారు. కానీ వాస్తవానికి వీరిద్దరూ బంధువులేనన్న సంగతి అందరికీ తెలియదు. ప్రకాష్ రాజ్ గారి మొదటి భార్య, శ్రీ హరి గారి భార్య సొంత అక్క చెల్లెళ్లు.

1990లలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించిన నగ్మాకు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్స్ జ్యోతిక, రోహిణి చెల్లెల్లు అవుతారు. నగ్మా తల్లి పోయాక తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో జ్యోతిక, రోహిణి జన్మించారు. జ్యోతిక హీరో సూర్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్, శ్రీలక్ష్మి బంధం ఎలాంటిదంటే.. శ్రీలక్ష్మి సోదరుని కూతురు. ఒకప్పుడు హీరోగా చేసి, సడన్ గా మరణించిన రాజేష్ కూతురైన ఐశ్వర్య స్వయానా శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది.

ఎన్నో విజయవంతమైన మూవీ నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బీ చౌదరి కొడుకే నటుడు జీవా. జీవా నటించిన ‘రంగం’ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. చౌదరి మరో కుమారుడు జిషన్ కూడా కొన్ని సినిమాలు చేసాడు.

దర్శకుడు సెల్వ రాఘవన్ కి నటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతాడు. మొదటి భార్యకు విడాకుల తర్వాత విద్యుల్లేఖ సోదరిని సెల్వ పెళ్లి చేసుకున్నారు.

మంచి మంచి సామాజిక అంశాలతో కథలల్లీ వాటికి మాస్ ఏలిమెంట్స్ ను జోడించి సినిమాలు తీస్తూ హీరోలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్నీ, ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా హిట్ల మీద హిట్లు కొడుతున్న కొరటాల శివ తెలుగు సినిమాలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అలాగే దర్శకుడిగా, నటుడిగా తనదైన శైలిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళీ గారికి కొరటాల శివ మేనల్లుడు అవుతాడు. కొరటాల సినిమా రచయితగా మారడానికి ప్రోత్సాహం ఇచ్చింది కూడా పోసానియే.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

Prabhas: ప్రభాస్ కి ఫ్రస్టేషన్ వస్తే అలా బిహేవ్ చేస్తారా.. డార్లింగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?

Published

on

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.

ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.

Advertisement

ఇష్టమైన ఫుడ్ తింటారు..
ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.

Advertisement
Continue Reading

Featured

Nikhil siddarth: కొడుకు పుట్టిన తర్వాత ఆ అలవాటు మానుకున్నాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

Published

on

Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.

త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.

Advertisement

పార్టీలకు వెళ్లడం మానుకున్న..
ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ఈ చిన్న పని చేస్తే చాలు ప్రభాస్ సలార్ సినిమా బైక్ గెలుచుకోవచ్చు.. ఎలాగంటే?

Published

on

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Advertisement

క్విజ్ కాంటెస్ట్..
ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!