గత నెల 23న పాకిస్థాన్ లోని లాహోర్ ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ బాంబు దాడిలో ముగ్గురు మరణించగా 24 మంది తీవ్రంగా గాయపడినట్లు పాక్ మీడియా సంస్థలు తెలియజేశాయి. అయితే ఈ విధంగా పాకిస్తాన్ లో బాంబు బ్లాస్ట్ కావడానికి ఇండియా పాత్ర ఉందని పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ బాంబు దాడి వెనుక ఇండియా హస్తముందని,పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ ఆరోపించారు. ఆదివారం ఇస్లామాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలిపారు.

పాకిస్తాన్ లో జరిగిన ఈ ఘటన భారత ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’ కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని ఆయన ఆరోపించారు.అయితే ఈ బాంబు ఘటనలో నిందితులను అరెస్టు చేసే వారి దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఆ వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులను విశ్లేషిస్తే సంచలన విషయాలు బయట పడ్డాయి ఈ సందర్భంగా యూసఫ్ తెలిపారు.
అయితే ఈ బాంబు దాడి వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అతని వివరాలను మాత్రం చెప్పకపోగా త్వరలోనే ఈ దాడి వెనుక ఉన్న వారు ఎవరు అనే విషయాలను పూర్తిగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ బాంబు 2008వ సంవత్సరంలో ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది.హఫీజ్ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు వాహనాన్ని ఆపి వెళ్లగా కొద్దిసేపటికే బాంబు పేలింది అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో హఫీజ్ తప్పించుకున్నారు.
ముంబై పేలుళ్ల సూత్రధారిగా మారిన హఫీజ్ ను ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా అతడిని టెర్రరిస్ట్గా ప్రకటించింది. హఫీజ్ సయీద్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఐనప్పటికీ అతడికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని ఇండియాతో పాటు అమెరికా వంటి దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.



























