Paruchuri Gopalakrishna : పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలుగానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా, నటులుగా వారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. ‘అనురాగ దేవత’ సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం ‘సైరా నరసింహారెడ్డి’ వరకు కొనసాగింది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలను అందించిన పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగులకు ఫేమస్. ప్రస్తుతం సినిమాలకు పెద్దగా పనిచేయడం లేదు. అందులో పరుచూరి గోపాలకృష్ణ గారు మాత్రం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎంతో మంది సినిమా డైరెక్టర్స్ కావాలనుకుంటున్న వారికి గైడెన్స్ ఇస్తూ అలానే ఒక సినిమా కథను చర్చిస్తూ విశ్లేషస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సైరా నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడారు.

ఆ సినిమా ఫలితం మేమనుకున్నట్లు రాలేదు…
చిరంజీవి గారు చాలా గ్యాప్ తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. అలా ఆ సినిమా తరువాత హిస్టారిక్ సినిమా అయిన సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు. ఆ సినిమాకు డైలాగులను పరుచూరి సోదరులు అందించారు. అయితే సినిమాలో డైలాగులు బాగా వచ్చాయని కాకపోతే సినిమా ఆశించినంత విజయం సాధించలేదు అంటూ అభిప్రాయపడ్డారు.

అయితే సినిమాలో డైలాగులకు చాలా మంది రాయలసీమ నుండి అభిమానులు, సినిమా చూసిన ప్రేక్షకులు ఫోన్లు చేసి అభినందించారు. డైలాగులు చెప్పడంలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎవరికి వారే సాటి, అద్భుతంగా చెప్తారు అంటూ పరుచూరి గోపాల కృష్ణ గారు అభిప్రాయాపడ్డారు.































