Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చిన్నారి చదువుతున్న పాఠశాలలో అనుకొని అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా గాయాలు పాలయ్యారు. చిన్నారి చేతులకు కాళ్లకు గాయాలు కావడం పొగ కారణంగా స్పృహ తప్పి పడిపోవడం జరిగింది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారనే విషయం తెలియగానే ఎంతోమంది స్పందిస్తూ చిన్నారి క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెంటనే సింగపూర్ బయలుదేరు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే చిన్నారి రెండు రోజులపాటు హాస్పిటల్ లో ఉండి పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడమే కాకుండా కొద్దిరోజులు విశ్రాంతి అవసరం అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ తన భార్య బిడ్డలను తీసుకొని తిరిగి ఇండియాకు వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భార్య అన్నా లెజినోవా, తన కుమార్తె కొడుకుతోపాటు ఈయన తిరిగి ఇండియాకి వచ్చేసారు.
కొద్దిరోజుల పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్లోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇలా తన కుమారుడిని ఎత్తుకొని పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయ కార్యకలాపాలను వదిలిపెట్టి సింగపూర్లో ఉండటం కుదరదు కనుక తన కుటుంబ సభ్యులనే ఇక్కడికి తీసుకు వచ్చారని తెలుస్తోంది.





























