మినరల్ వాటర్ అని చెప్పి ఏవేవో కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. వాటిని 20 నుండి 30 రూపాయల ధర చెల్లించి మరీ తాగుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడం సంగతి అటుంచి కొత్త జబ్బులు వస్తున్నాయి. నీటి నుండి మన శరీరానికి కావలసిన కాల్షియం, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సల్ఫర్ వంటివి తాగే నీరు నుండే అందుతాయి. ఇపుడు మనం తాగే ఈ మినరల్ వాటర్ లో ఏమి ఉండక పోగా అవి మంచి రుచిగా ఉండడానికి, చక్కని రంగు కనిపించడానికి నీళ్లలో రసాయనాలు కలిపి అమ్ముతున్నారు.

వాటిని తాగడం వలన మన శరీరానికి కాల్సియం అందక చిన్న వయసులోనే కాళ్ళు, చేతులు, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. రోగనిరోధశక్తి తగ్గి, రక్తంలో హిమోగ్లబిన్ తగ్గడం వలన ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మనమే మార్పు తీసుకురావాలి. అందుకే ఇప్పడే ప్లాస్టిక్ వాటర్ తాగడం ఆపేయడం మంచింది.

మనకు అందుబాటులో ఉన్న నీటినే కాచి చల్లార్చి తాగడం ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుంది. కాచిన నీటిని రాగి పాత్రలో కానీ మట్టి కుండలో కానీ నిల్వఉంచి ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోండి. రాగి పాత్ర లేని పక్షంలో మట్టికుండలో ఒక రాగి ముక్కను వేసుకుని ఆనేతిని రోజు త్రాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రతి గంటకు ఒక గ్లాస్ నీటినీ తీసుకోవడం వలన మన శరరానికి కావాల్సిన నీరు అందుతుంది. ప్రతి రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని ఖచ్చితంగా త్రాగాలి ప్రతి ఒక్కరూ. ఇటువంటి పద్దతులు అలవాటు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.




































