గత కొద్ది రోజుల క్రితం చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ కే 40 గేమింగ్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో పోకో ఎఫ్3 జీటీగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ టిప్ స్టర్ తెలిపారు. ఈ రెండు ఫోన్లు ఒకే మోడల్ నంబర్ కలిగి ఉన్నాయి. అయితే ఈ పోకో ఎఫ్3 జీటీ ఇండియాలో లాంచ్ అయ్యే విషయాన్ని షియోమీ మాత్రం దీని గురించి ఎటువంటి ప్రకటనా చేయలేదు.
రెడ్ మీ కే40 గేమింగ్ ఎడిషన్లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.ట్యూన్డ్ ఆడియో, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, షోల్డర్ బటన్లు ఇందులో ఉన్నాయనే విషయాన్ని టిప్ స్టర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.పోకో ఎఫ్3 జీటీ స్మార్ట్ ఫోన్ M2104K10I మోడల్ నంబర్తో కనిపించిందని టిప్ స్టర్ పేర్కొన్నారు.
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెట్ రేట్ 120 హెర్ట్జ్గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 480 హెర్ట్జ్గానూ ఉంది. హెచ్డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.5065 ఎంఏహెచ్ బ్యాటరీ,67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్ కాగా,8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ వీడియో కాల్ కెమెరా కోసం 16 మెగాఫిక్సల్ కెమెరా ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…