విజయవాడ సూర్యారావుపేట పీఎస్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది. గతంలో తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా సూర్యారావుపేట కోర్టు సెంటర్కు వెళ్లిన లోకేశ్, ఆయన్ను ఆక్కడ పరామర్శించారు.

ఈ సందర్భంగా లోకేశ్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

































