భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్నా.. ఆడపిల్లలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళల పట్ట అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే ఇక సమాజంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది..? తనకు అన్యాయం జరిగిందంటూ.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిల పట్ల ఓ పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆమె ఫోన్ నంబర్ తీసుకొని వేధించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొల్లాం జిల్లా కాలయపురానికి చెందిన ఓ మహిళను అక్కడే ఉన్న కొందరు అల్లరి చేస్తున్నారని.. నాలుగు రోజుల క్రితం కొట్టారక్కర పోలీసులను ఆశ్రయించింది.
మద్యం తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ అల్లరిమూఖలను స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరో సారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు. ఇదిలా ఉండగా.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళకు పోలీసు అధికారి బిజు జాన్ (43) ఫోన్ చేయడం ప్రారంభించాడు.
ఆమెకు ఫోన్ చేసి ముద్దు కావాలని అడగడంతో పాటు.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. పోలీసు అధికారి బిజు జాన్ పై చర్యలు కూడా తీసుకోనున్నట్లు ఉన్నత పోలీసులు అధికారులు వెల్లడించారు.




























