Political Analist KS Prasad : ఏపీ రాజకీయాల మీద ఎవరికి ఎంత ఆసక్తి ఉందో కానీ రామ్ గోపాల్ వర్మ కి మాత్రం బాగా ఆసక్తి. తాను రాజకీయాల్లోకి రాడు కానీ నిత్యం రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అది కూడా ఏపీ రాజకీయాలే కావాలి. ఇటీవలే చంద్రబాబు నాయుడు టార్గెట్ గా గుంటూరు, కందుకూరు సభలలో జరిగిన ప్రమాదాలకు చంద్రబాబు కారణం అన్నట్లు మాట్లాడి హిట్లర్, ముస్సోలిని తరువాత నువ్వే అంటూ విమర్శించాడు. ఇక నేడు పవన కళ్యాణ్ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ కాపుల గౌరవంను కమ్మోళ్ల దగ్గర తాకట్టు పెట్టడు అంటూ కుల రాజకీయం చేసేసాడు. ఇక ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ తన విశ్లేషణ చెప్పారు.

వర్మకు రాజకీయ అవగాహన శూన్యం…
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడును జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో కలవడం సభలు నిర్వహించుకోడానికి అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో గురించిన చర్చ జరిగిందంటూ ఇద్దరూ చెబుతున్నా, భవిష్యత్తు పొత్తుల గురించే ఇద్దరూ చర్చించి ఉంటారు అన్న అనుమానలను అందరికీ కలిగాయి. ఇక ఈ విషయం మీద వర్మ ఏకంగా కాపులను కమ్మోళ్ళకి అమ్మేశాడు పవన్ అంటూ కామెంట్స్ చేసాడు. దీనిపై పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ మాట్లాడుతూ వర్మ కు రాజకీయ జ్ఞానం లేదు అంటూ అభిప్రాయపడ్డారు. కాపులకు పవన్ కళ్యాణ్ లీడర్ కాదు. పవన్ కళ్యాణ్ ది కాపు పార్టీ అనో జగన్ ది రెడ్డి పార్టీ అనో పెడితే వాళ్లకు వచ్చే ఓట్లకు వాళ్ళ సామాజిక ప్రజల శాతానికి పొంతన ఎందుకు లేదు. కాపులందరికీ నాయకుడిగా పవన్ ను చిత్రించడంలోనే వర్మ అవగాహనా రాహిత్యం ఉంది. సినిమా వాళ్ళు సినిమాల్లో హీరోను చుసినట్లే బయట కూడా వాళ్ళు హీరోలు అని అనుకుంటారు.

భ్రమలో బ్రతుకుతూ ఉండే సినిమా వాళ్ళ కామెంట్స్ పట్టించుకోనవసరం లేదు అంటూ తెలిపారు. కాపుల కోసం ఒకప్పుడు లీడర్ గా నిలబడిన వంగవీటి రంగ కొడుకు గెలవడానికే ఇప్పుడు కష్టపడుతున్నాడు, ఆలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా కాపు లీడర్ అవుతాడు. ఏ కులానికి లీడర్ ఉండడు, వాడి వెనక కులం మొత్తం నడవదు అంటూ చెప్పారు కేఎస్ ప్రసాద్. అలా అయితే కమ్మ కులస్థులందరూ చంద్రబాబుకు ఓట్లేస్తే 40% ఓట్లు ఎలా వచ్చాయి. అలానే కేవలం రెడ్డి కమ్యూనిటీ ఓట్లే పడితే జగన్ కు అన్ని సీట్లు ఎలా వస్తాయి అంటూ విశ్లేషించారు.



































