ఏపీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు వాదన ప్రతి వాదనలతో హీటెక్కిపోతోంది. పోసాని కృష్ణమురళి రెండు సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి ఓ రేంజ్ లో పవన్ పై విరుచుకుపడ్డాడు. దీనిపై అతడి అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్న పోసాని.. అందులో ఓ నటి గురించి ప్రస్తావన తెచ్చాడు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ ఓ అంశాన్ని లేవనెత్తారు.

ఇది కూడా ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ప్రముఖ సినీ పరిశ్రమలోని పేరున్న ఓ వ్యక్తి ఆ పంజాబీ అమ్మాయిని గర్భవతిని చేసి.. ఆపై అబర్షర్ చేయించాడని అతడు విమర్శలు చేశాడు. దమ్ముంటే అమ్మాయికి న్యాయం చేయాలని పవన్ కు సవాల్ విసిరాడు. ఆ అమ్మాయి పూనమ్ కౌర్ అంటూ.. ఆ అమ్మాయినే పరోక్షంగా అన్నాడనే వార్తలు వినిపించాయి.

దీంతో అప్పటి నుంచి పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నటి కూడా ఆ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. సీని పరిశ్రమలో తనకు గురు అంటే ఒక్కరే అని.. అది కూడా దాసరి గారు అంటూ అన్నారు. ఈ రోజు దాసరి నారాయణ రావు ఉన్నట్టు.. ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది అంటూ .. మిస్ యూ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

అందులో ఏముందంటే.. ‘తాను రేప్ కు గురయ్యాను.. కానీ సమాజం తనను ఒక విధంగా చూస్తుంది.. శీలం పోయింది.. సిగ్గు పోయిందని అంటున్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. వాడు సిగ్గుపడాలి.. నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఆ మహిళ ఆ వీడియోలో చెబుతుంది. ఈ మాటలు ప్రతీ ఒక్కరినీ కదిలించాయి. దీనిని చూసిన అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడో వచ్చిన ఈ వీడియో పూనమ్ షేర్ చేశారు. ఆమె ఈ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.




























