Connect with us

Featured

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

Posani Krishna Murali:గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు

Published

on

Posani Krishna Murali:గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నిన్న సినీ హీరోలు డైరెక్టర్లు వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డి ని భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?
Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఈ మీటింగుకు ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, చిరంజీవి, కొరటాల వంటి వారు హాజరయ్యారు. ఇక వీరు సినిమా సమస్యల గురించి టికెట్ల వ్యవహారం గురించి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించినట్లు బయటకు చెబుతున్నారే కానీ లోపల ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ లోపల ఈ అంశాల గురించిచర్చించి ఉండవచ్చు అంటూ పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?
Posani Krishna Murali: సీఎం జగన్ మీటింగ్ లో రచ్చ చేసిన పోసాని.. వద్దని సర్ది చెప్పిన జగన్?

ఇక ఈ మీటింగుకు నటుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో పోసాని మాట్లాడుతూ స్టార్ హీరోలపై సెటైర్లు వేశారని వినికిడి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టార్ హీరోలందరూ భారీగా పారితోషకాలు పెంచడం వల్ల వైసీపీ ప్రొడక్షన్స్ పెరిగిపోయే నిర్మాతలపై భారం పడటం వల్ల సినిమా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారు అంటూ పోసాని స్టార్ హీరోలను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

విషయం పక్కదారి పట్టించ వద్దు…

పోసాని మురళి కృష్ణ ఈ విధంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పక్కదారి పట్టించవద్దని పోసానికి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంత వరకు క్లారిటీ ఉందో తెలియదు కానీ మొత్తానికి ముఖ్యమంత్రితో భేటీ అయిన అనంతరం ప్రతి ఒక్కరూ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే సమస్యను సృష్టించారో వారికి వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్ల కన్నా పవన్ కళ్యాణ్, నాని, హీరో సిద్ధార్థ్ వంటి వాళ్లే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Featured

Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?

Published

on

Nag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.

Advertisement

విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.

Advertisement

11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!